18, డిసెంబర్ 2024, బుధవారం

మన హిందూ ఆలయాలు వాటి విశిష్టత

 మన హిందూ ఆలయాలు వాటి విశిష్టత 



సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు: 

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 

2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 

3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 

4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 

5. మొగిలీశ్వర్.

6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.

7.సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా 


నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు: 

1. మహానంది

2. జంబుకేశ్వర్ 

3. బుగ్గరామలింగేశ్వర్

4. కర్ణాటక కమండల గణపతి.

5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.

6. బెంగళూర్ మల్లేశ్వర్ 

7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం

8. సిద్ధగంగా

9.అలంపురం


నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు. 

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  

3. మంజునాథ్.

శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్

సముద్రమే వెనక్కివెళ్లే 

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

స్త్రీవలె నెలసరి అయ్యే 

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  

2. కేరళ దుర్గామాత.

ఁబహ్మ పేరు తో ఏకైక శివాలయాలు

అలంపూరులో నవఁబహ్మేశ్వర ఆలయాలు

9 రూపాలలో శివలింగాలు ఉంటాయి   


రంగులు మారే ఆలయం. 

1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.


నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు 

 1. కాణిపాకం,  

2. యాగంటి బసవన్న,  

3. కాశీ తిలభండేశ్వర్,  

4. బెంగుళూరు బసవేశ్వర్

5. బిక్కవోలు లక్ష్మీగణపతి


స్వయంభువుగా 

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

ఆరునెలలకు ఒకసారి తెరిచే 

1. బదరీనాథ్,  

2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం. 


సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు 

హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.


12 ఏళ్లకు ఒకసారి

పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.


స్వయంగా ప్రసాదం 

1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.

2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం


ఒంటి స్తంభంతో

యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.


రూపాలు మారే

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.


నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు 

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి


మనిషి వలె గుటకలు  

వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.


అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి. 


ఛాయా విశేషం 

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం


నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్


ఇంకా... 

తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్,  కంచి, 

చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం etc


పూరీ 

పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.


ఇవి  తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు నిర్మాణం చేశారు (సృష్టి చేశారు)విశ్వకర్మ పరమాత్మ వంశీయులైన విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు వారికి పాదాభివందనములు. .

💐💐💐🙏🙏🙏


✍🏻🚩 సర్వే జనాః సుఖినోభవంతు 🚩

12, డిసెంబర్ 2024, గురువారం

🌳గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీయాలి?

 🌳గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీయాలి?

       


పార్వతీదేవి, శ్రీమహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తనచేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. 


అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చట్టుక్కున నోట్లో వేసుకుని, మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. 


‘ఏం వెతుకుతున్నావు మావయ్యా!’ అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు.


’ఇంకెక్కడుంది మావయ్యా చక్రం! నేను తినేశాగా!’ అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహాఇష్టం. గణపతిని ఏమి అనలేడు. అందువల్ల ‘బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహాసుదర్శనం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా’ అని నానారకాలుగా బ్రతిమాలాడు విష్ణువు. 


గణపతి పట్టువదల్లేదు.ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడిచెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్ళు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా, విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పించేంతగా నవ్వాడు.


ఇలా నవ్వడంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుంచి గణపతి ముందు గుంజీళ్ళు తీసే సంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే. 


ఈ విధంగా శ్రీమహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీళ్ళలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది.


జయ గణేష పాహిమాం!  జయ గణేష రక్షమాం!!

పంచారామాలు

 🙏🏵️🙏పంచారామాలు🙏🏵️🙏



1. దాక్షారామము :

పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరియు  సగభాగం నలుపుతో ఉంటుంది.ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు.


2. అమరారామము :

పంచారామల్లో రెండవదైన 'అమరారామము', గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీతీరమునందు వెలసినది. ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.

అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి యున్నది.


3. క్షీరారామము :

క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ 'శివుని' మూర్తిని "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి" అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో 'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట.  ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. 'శివుడు' తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట.  క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది. క్రమంగా 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో కట్టబడింది.


4. సోమారామము :

పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము". పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు. ఇచ్చట 'శివలింగానికి' ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం', అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.


5. కుమారభీమారామము :

పంచారామాల్లో చివరిది, 5వది అయిన 'కుమారభీమారామము', తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు. ఇక్కడ స్వామిని "కాల బైరవుడు" అని పిలుస్తారు.ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు.

.

#pancharamalu

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు:

 శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు:



శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.


ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.


తిరుచందూర్: సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్ లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్ లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం.


స్వామిమలై: స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.


పళని: ఆంద్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి వుందో తమిళనాడులో పళవి క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.


తిరుత్తణి: తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.


పరిముదిర్ చోళై: దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.


తిరువరన్ కున్రమ్: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్ కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరూ భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కున్రమ్.


తిరువన్నామ్మలై కృత్తికా దీపం

 తిరువన్నామ్మలై కృత్తికా దీపం, తిరుకార్తీగై దీపం రోజున తిరుకార్తీగై దీపం ఎవరు వెలిగిస్తున్నారు? మీరు ఆ హక్కును ఎలా పొందారు?





ప్రపంచమంతట నిలుస్తున్న మామలైపై మహాజ్యోతిని చూసే భాగ్యం ఉంటే, అన్నామలైపై మహాజ్యోతిని వెలిగించడం ఎంత భాగ్యం! తలచుకుంటేనే ఈ పనిని తాకి నెరవేర్చినందుకు పర్వత  రజకులాలు గర్వపడుతున్నాయి.


తిరువన్నామలై కార్తీగైలో జరిగిన దీపోత్సవం ముగింపు సందర్భంగా అన్నామలైపై మహాదీపం వెలిగించి అప్పని తీర్చుకునే హక్కును సాధించారు. తిరువన్నామలై నగరంలోనే సుమారు 2 వేల కుటుంబాలున్నాయి. వారిలో ఐదుగురు వారసుల కుటుంబం పర్వతంపై దీపం వెలిగించే హక్కును అమలు చేస్తున్నారు. 


రాజకులాలకు శ్రీవారి జోతి ఎత్తే హక్కు ఎలా వచ్చింది?

పర్వత  రజకుల వంశానికి పుత్రికగా జన్మించిన పార్వతీ దేవి. మత్స్యకార పరిశ్రమ కారణంగా రుతుపవన రాజాలను మత్స్యకారులు అని పిలిచారు, మరియు సెంపన్ తో తయారు చేసిన పడవలో చేపలు పట్టడం వల్ల కాపర్లు అని పిలవ తిరువణ్ణామలై కొండ పైన మహా దీపం వెలిగించే పనిని నెరవేరుస్తున్న పార్వతి దేవియర్ వారు.


ఒకప్పుడు బ్రహ్మ ఋషి ధ్యానం కరిగించే పనిలో రాక్షసులు పాల్పడ్డారు. బ్రహ్మ ఋషులు కోపం వస్తే చేపలు ఏర్పడి సముద్రంలో దాక్కుంటారు. రాక్షసులను నాశనం చేసి తపస్సును మెరుగుపరచమని ఋషులు శివుడిని వేడుకున్నారు.పరువదరాజన్ అనే సేవకులలో నీచమును గ్రహించిన శివుడు. సముద్రంలో చేపల రూపంలో దాగిన రాక్షసులను నాశనం చేయాలని ఆదేశించాడు. దానికి సహాయం చేసి జ్ఞాన వల మరియు విశ్వకర్మ దేవత సృష్టించిన సెంబోన్ బోటును ఇచ్చాడు.


సముద్రంలోకి దూసుకెళ్లిన పరువదరాజన్ చేపల ఆకారపు రాక్షసులను పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. విపరీతమైన నిస్సహాయ రాక్షసులు మళ్ళీ మళ్ళీ సముద్రంలో దూకిపోయారు. అలసిపోయిన పరువదరాజా కూతురు పార్వతిని సాయం కోరాడు. మనసు దిగి నడిసముద్రంలో అగోర రూపంలో నిలబడి చేపలన్నీ మింగి నాశనమైన పార్వతి దేవి. అప్పుడు అనుకోకుండా సముద్రం కింద తపస్సు చేసిన మీనమకరిషి అనుకోకుండా ఒడ్డుకు వచ్చారు.తపస్సులో "నీ రాజసం నశించి చేపలు పట్టి బ్రతకాలి" అని శాపించిన పరువదరాజ. దీంతో అయిన పరువదరాజ పరిగెత్తుకుంటూ వెళ్లి శివుడిని వేడుకున్నాడు.


 కరుణాకటాక్షమైన శివా కార్తీగై రోజున తిరువన్నామలై లో జ్యోతిగా చూపిస్తా ఆ జ్యోతి లోడింగ్ చేసే పని పరువదరాజ కుటుంబం నెరవేర్చాలి. జ్యోతిని పూజించే కోట్లాది భక్తులు,అరోహరా అనే అరుపుల సకల పుణ్యం పర్వత కులానికి పోతుందని అన్నామ తిరువణ్ణామలై లో జ్యోతి వెలిగించే పనిని రుతుపవన రజకులతులు నిర్వర్తిస్తున్నారు.


ప్రస్తుతం అన్నామలైపై మహా దీపం వెలిగించే పని పూర్తి చేస్తున్న పర్వత రాజకుల సంప్రదాయంలోని ఆదియార్లు, తిరువన్నామలై తామరికులం ప్రాంతంలో నివసిస్తున్న 5వ వారజకుల కుటుంబాలు ఏటా మహా దీపం వెలిగించే పని చేస్తున్నట్లు తెలిపారు.దీపం వెలిగించడానికి 5 మంది ఎంపిక, (48 రోజులు) ఉపవాసం ఉంటారు. 


దీపాలు వెలిగించిన సేవకులకు అన్నామలైయార్ ఆలయంలో పరివట్టం నిర్మించబడును. అనంతరం అన్నామలైయార్ పుణ్యక్షేత్రం నుండి మట్టి పానలో మహా దీపం వెలిగించడానికి శివాచార్యులు భరణి దీపం మనకు అందజేస్తారు.మేళతాళం అంటూ కొండపైకి పంపే కార్యక్రమం ఉంటుంది. మట్టిలో మోసే దీపాన్ని ఆరిపోకుండా కొండ శిఖరానికి తీసుకెళ్దాం. కొండపై వేంచేసిన మహా దీప కొప్పరైలో నెయ్యి వేసి తిరుగుదాం. దానిపై, కర్పూర బంధాలను నెట్టేద్దాం.


సాయంత్రం 5.58 గంటలకు అర్థనారీశ్వర్ అన్నామలైయార్ ఆలయం వద్ద దర్శనమిస్తారు. ఈ  సాంప్రదాయం లో ఉన్నవారు గుడి జెండా చెట్టుకు వ్యతిరేకంగా దీపం వెలిగిస్తారు. ఆ తరువాత అన్నామలై పైన మహా దీపం వెలిగిస్తాం.మహా దీపం వెలిగించిన క్షణం దేవుడి పండుగ అనిపిస్తుంది. మన కళ్ళలో మరియు భావాల్లో దీపం మాత్రమే ఉంది. "మహా దీపం వెలిగించే జ్వాలమైన మేము శివాచార్యుల నుండి పర్వత ఎక్కే ముందు పాపప్రాయశ్చిత్తం కోసం ప్రార్ధించేవాళ్ళం. 


తిరువన్నామలై దేవుడు కాబట్టి కొండ ఎక్కడం పెద్ద పాపం. అందువల్ల కొండగట్టున గుహ నమశివాయార్ ఆలయం వద్ద అన్నామలైయార్ తిరుపదం ముందు 'లోకాన్ని రక్షించే ఏసాను నీ కార్యం నెరవేరడానికి కొండపై ప్రయాణిస్తున్నాము. పర్వతం మీదకు అనుమతించమని ప్రార్థించిన తరువాతే మా ప్రయాణం కొనసాగుతుంది.


దీపం వెలిగించేటప్పుడు శివ పురాణం పాడుతూ ఉంటుంది మన సంప్రదాయం. శివునికి తగిన గొలుసును జపిద్దాం. నిరంతరాయంగా మహా దీపం పర్వతం పై 11 రోజుల ప్రకాశవంతం మహా దీపం వెలిగించబడుతుంది. ప్రతిరోజూ అన్నామలైయార్ ఆలయం నుండి దీపం వెలిగించడానికి కర్పూరం  నెయ్యి  తీసుకువెళతాం. ఇదంతా అరునచలేశ్వరుడు మాకు ఇచ్చిన కృప .


అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


11, డిసెంబర్ 2024, బుధవారం

శ్రీ భావనారాయన స్వామి ఆలయం : బాపట్ల...!!


 శ్రీ భావనారాయన స్వామి ఆలయం : బాపట్ల...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿శైవమునకు పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవమునకు కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి 


🌹1) బాపట్ల (భావపురి), 


🌹2) పొన్నూరు (స్వర్ణపురి),


🌹3)  భావదేవరపల్లి (కృష్ణా జిల్లా), 


🌹4) సర్పవరం (నేడు కాకినాడలో అంతర్భాగం), పట్టిసం. 

వీనిలో ప్రకాశం జిల్లాలోని పెదగంజాం కూడా ఉంది అని చెప్తారు. 


🌹5) ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచ భావనారాయణ క్షేత్రాలలో ప్రధానమైన క్షేత్రం బాపట్లలో వెలసిన భావనారాయణ ఆలయం.


🌸ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్లగా, బాపట్లగా మారింది.


🌿ఇది ప్రాచీన ఆలయము. ఈ ఆలయము శాలివాహం శకం 515 లో (క్రీ.శ. 594 లో) ప్రమాదీ నామసంవత్సర ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడు ప్రతిష్ఠింప బడినదని చరిత్రకారులు తెలియజేయుచున్నారు.


🌸కాని స్థలపురాణం మాత్రం, కృత, త్రేతా, ద్వాపర యుగాలలో ఇచట బ్రహ్మర్షులు సమావేశమగు చుండేవారని, వారచట ఒక యాగకుండమును ఏర్పాటు చేసి అచట నారాయణుని స్మరించుచూ హోమం చేయుచుండేవారని


 🌿అప్పుడు నారాయణుడు ఆయా యుగ ధర్మముననుసరించి, వేర్వేరు  రూపాలతో వారికి దర్శనమొసగుచుండే వాడని, ఆ ప్రకారం నారాయణుడు ద్వాపరయుగంలో క్షీరవృక్షంలో శేషరూపం ధరించి వారిని ఆశీర్వదించాడని, తరువాత వచ్చిన కలియుగంలో ఎవరును క్షీరవృక్షంలో ఉన్న నారాయణుని కనుగొనలేకపోయారనీ అంటారు.


 🌸కలియుగంలో కుళోత్తుంగచోలుడు దిగ్విజయ యాత్ర చేయుచూ ఈ ప్రాంతానికి వచ్చాడని, అపుడు వారి ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుచు క్షీరవృక్షము ఆకులు తినబోగా, వాని తొండములు ఆ చెట్టుకు అంటుకొనిపోయి రాలేదని, 


🌿రాజు ఆ వార్త విని అశ్చర్యం చెంది ఆ ప్రదేశానికి వచ్చి ఆ చెట్టును, ఆ చెట్టునంటుకొనిపోయి నిల్చుండియున్న ఏనుగులను చూచి, అది దైవమహిమయని గుర్తించి దైవాన్ని ప్రార్థించగా, 


🌸అతడు తన విషయాన్ని తెలియజేసి, మీ ఏనుగులు చేసిన పాపానికి పరిహారంగా మీరు ఇచట ఒక ఆలయము కట్టించుమని ఇరువురు బ్రాహ్మణుల ద్వారా తన భావాలను తెలియజేసిన నారాయణుని, భావనారాయణుడన్న పేరుతో ప్రతిష్టించి ఆరాధించాడని, అప్పటి నుండి ఆ ఆలయము భావనారాయణ ఆలయముగా ప్రసిద్ధిగాంచినది ఆ పురాణం వివరించుచున్నది.


🌿 ఇక్కడ భావన్నారాయణ స్వామి కాలి వేళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుంది. 

ఇలా ఓ దేవతామూర్తి భక్తుల కోసం ఎదురు చూడటం భారత దేశంలో మరెక్కడా కనిపించవు. 


🌸 ఈ ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగా ఉంటుంది. 

ఇది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం.


🌿ఆ ఆలయానికి రెండు ధ్వజస్థంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు గజపాద (ఏనుగు కాలు) ఆకారంలో ఉండటం విశేషం. ఆలయ గర్భగుడి వెనుక పై కప్పు మత్స్యం అంటే చేప ఆకారంలో కనిపిస్తుంది. దీన్ని తాకితే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. 


🌸 ఇదిలా ఉండగా భావనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం జరిగే సమయంలో పునాదుల కోసం తవ్వుతుండగా అక్కడి వారికి జ్వాలా నరసింహ స్వామి విగ్రహం దొరికింది. దీంతో ఆ విగ్రహన్ని స్వామివారి విగ్రహం పక్కనే పెట్టి పూజించేవారు అయితే ఆ విగ్రహం అక్కడ పెట్టినప్పటి నుంచి దేవాలయానికి దగ్గరగా ఉన్న కారంచేడు అనే గ్రామం తరుచుగా అగ్నిప్రమాదాలు జరిగేవి. 


🌿ఈ విషయమై క్రిమకంఠ చోళుడు అక్కడి పురోహితులను సంప్రదించి పరిష్కారం చూపమని అడిగారు దీంతో పురోహితులు జ్వాలా నరసింహుడి ఉగ్ర రూపం వల్ల ఇక్కడ తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఆయన్ను శాంతింప చేయాలని నిర్ణయించారు. 


🌸ఇందు కోసం స్వామివారి ఆలయానికి ఎదురుగా శాంత కేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఆ కారంచేడు గ్రామంలో అగ్నిప్రమాదాలు నిలిచిపోయాయని చెబుతారు. 


🌿 జ్వాలా నరసింహుడి విగ్రహం ఆసీన రీతిలో ఉంటుంది. నాలుగు చేతులు ఉంటాయి. పై రెండు చేతులతో శంఖం, చక్రం ఉండగా కింది కుడి చేయి అభయ హస్తం. ఎడమ చేయి తొడపై ఉంటుంది.


🌸 ఈ గ్రామంలో ఎనిమిది దిక్కుల్లో..

 వల్లాలమ్మ, 

కుంచలమ్మ, 

శంకరమ్మ, 

శింగరమ్మ, 

ధనకొండలమ్మ,

 మూలకారమ్మ,

 నాగభూషణమ్మ,

 బొబ్బలమ్మ అనే ఎనిమిది మంది గ్రామ దేవత శక్తులను ఎనిమిది దిక్కుల్లో ప్రతిష్టించారు. 


🌿 ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వేసవిలో జరిగే బ్రహ్మోత్సవాలకి లక్షల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు. ఇంకా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుంది.


🌸ఈ దేవాలయంలో భావన్నారాయణుడు ఇతర పరివార దేవతలయిన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆళ్వారులతో కొలువైవుండి భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నాడు. 


🌿ముఖ్యంగా కేశవస్వామి ఎంతో సుందరంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తాడు. ఇక్కడి శాంతకేశవ స్వామివారి మూలవిరాట్టును ఏమి కోరుకొంటే అది నెరవేరుతుందని చెబుతారు.


🌸దేశములోనే ఎక్కడాలేనట్టుగా విఖనస మునీంద్రులకు కూడా మందిరము ఉంది. అందుకే బాపట్ల మంచి విద్యాకేంద్రంగా వెలుగొందుతున్నదని చెప్తారు... స్వస్తి..🌞🙏🌹🎻


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

10, డిసెంబర్ 2024, మంగళవారం

*శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలలో ఒకటైన తిరుప్పరంకుండ్రం ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం.*


       

*శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరు దివ్య  క్షేత్రాలలో ఒకటైన తిరుప్పరంకుండ్రం ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం.*

తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం. 

ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము ఈ విధముగా ఉంది. మన బుజ్జి సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన శ్రీ వల్లి, దేవయానీ అమ్మలు ఇద్దరు శ్రీ మహా విష్ణువు యొక్క కుమార్తెలు. వీరి యొక్క పేర్లు అమృత వల్లి, సుందర వల్లి. (మహా విష్ణువుకి కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్య పోకూడదు. మన పురాణములలో చెప్పే ఆఖ్యానములకు అనేక స్థూల, సూక్ష్మ, కారణ కారణాలు ఉంటాయి. అవి మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు. వాటిలోని సూక్ష్మములు గురువుల ద్వారా తెలుసుకోవాలి).

అయితే ఒక రోజు వల్లి, దేవయానీ అమ్మలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు. అప్పుడు స్వామి అమృత వల్లితో “నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు. తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను” అని అభయం ఇస్తారు. అలాగే సుందర వల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి. తరువాత అమృత వల్లి చిన్న ఆడ శిశువుగా మారి, మేరు పర్వతం దగ్గరకి వెళ్లి, ఇంద్రుడిని కలిసి “ నేను శ్రీ మహా విష్ణువు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకు ఉంది“ అని చెప్తుంది. ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఇరవతం ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవలెనని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఐరావతము అమృత వల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది ఆమెకు పెళ్ళి చేసుకునే వయసు వచ్చే వరకు. అమృత వల్లిని దేవతల ఏనుగు అయిన ఐరావతము పెంచడం వల్లనే, ఆమెకి దేవయాని అని పేరు వచ్చింది. (తమిళంలో “యానై” అంటే ఏనుగు). అదే విధంగా సుందర వల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది. ఆమెను నంబి అనే భిల్ల నాయకుడు (గిరిజన నాయకుడు) పెంచుకుంటారు. తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు. అది వల్లీ కళ్యాణ ఘట్టం. వేరే అఖ్యానంలో వివరిస్తాను. ఒకానొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శపింపబడతారు (దీని వెనుక వృత్తాంతం నాకు ఇంకా తెలియదు, తెలిస్తే తప్పక ఇక్కడ తెలియజేస్తాను). వారి యొక్క శాప విమోచనం కొఱకు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుప్పరంకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి తెలియచేయబడుతుంది. 

తిరుచెందూర్ లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత, మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు. స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాపవిమోచనం కలిగి, స్వస్వరూపం వచ్చి, వారు స్వామిని ఆ క్షేత్రములో కొలువుండమని ప్రార్ధిస్తారు. వారి ప్రార్ధనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా, అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు. అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు. అక్కడే ఉన్న చతుర్ముఖ బ్రహ్మ గారికి, శ్రీ మహా విష్ణువుకి తన ఈ కోర్కెని తెలియజేస్తాడు ఇంద్రుడు. బ్రహ్మ  గారు, నారాయణుడు కూడా చాలా సంతోషించి, సుబ్రహ్మణ్యునికి తెలుపగా, స్వామి అంగీకరిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరంకుండ్రం లోనే జరిగింది. శివ పార్వతులు, లక్షీనారాయణులు, సరస్వతీ బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది. ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరగడం వల్లనే ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు. రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది. 

ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది. ఆలయం లోకి ప్రవేశించగానే, అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్తంభం మీదా ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది. అక్కడే ఒక స్తంభం మీద దుర్గా అమ్మ వారు ఉంటారు. అక్కడ అందరూ వెన్న ముద్దలతో అమ్మ వారికి పూజ చేస్తారు. అది ఎందుకో మాకు కొంత భాష రాకపోవడం వల్ల తెలుసుకోలేక పోయాము. మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు, పార్వతీ దేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహా విష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది. చాలా బాగుంటుంది. 

ఇంకా లోపలి వెడితే, ముందుగా స్వామి వారి యొక్క వివాహం మయూరము, విఘ్నేశ్వర వాహనం మూషికము, శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇంకా పైకి మెట్ల మీదుగా వెడితే గర్భాలయం సమీపిస్తాము. ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారు, ఆయనకి ఎడమవైపు దేవయానీ అమ్మ, కుడి వైపు నారద మహా ముని క్రిందకి కూర్చుని ఉంటారు. ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు, కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకం చేస్తారు. అంతేకాక, అక్కడే విఘ్నేశ్వర స్వామి వారు “కర్పగ వినాయగర్” అనే పేరుతో ఉంటారు. పెద్ద మూర్తి, చాలా బాగుంటారు. ప్రక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు. దుర్గా అమ్మ వారు మధ్యలో ఉంటారు. దుర్గ అమ్మకి ఎడమవైపు వినాయకుడు, కుడి వైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. శివలింగం ఎదురుగా పెరుమాళ్, అంటే శ్రీ మహా విష్ణువు కూడా ఉంటారు. ఈ స్వరూపాలన్నీ, ఆలయం లోపలకి వెళ్ళాక, మెట్ల దారిలో కొంచెం పైకి ఎక్కవలసి ఉంటుంది. పైకి ఎక్కిన తరువాత సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడు, శివ లింగము, దుర్గా అమ్మ, పెరుమాళ్ అందరూ ఒకే చోట ఉంటారు. ముందు కొత్తగా వెళ్ళిన వాళ్లకి అసలు మూల స్వరూపం ఎలా ఉంటారో, ఎక్కడ ఉన్నారో వెంటనే అర్ధం కాదు. చాలా చక్కని అనుభూతి.

🚩సర్వేజనా సుఖినోభవంతు 🚩

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...