ganapathi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ganapathi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2024, బుధవారం

Ainavilli Sri Siddi Vinayaka Swamy Temple,(అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం)

 


“ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరినకోర్కెలు తీర్చేస్వామి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి.”

అయినవిల్లి సిద్ధి వినాయక  స్వామి వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో అయినవిల్లి గ్రామం లో శ్రీ సిరి సిద్ద వినాయక స్వామి ఆలయం కొలువై  ఉంది.  నిత్యం  భక్తాదులు రాకపోకుతో  ఈ దివ్య క్షేత్రం లో ఉండే  సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు.

పవిత్రమైన గోదావరి  నది ఒడ్డున అమీరిన కోలసీమ  లో అడుగడుగునా దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కోలసీమలో  అయినవిల్లి  శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఆలయం ఉంది. దక్షిణ దక్ష ప్రదాపతి దక్షయజ్ఞం  చేసే ముందు  విజ్ఞ వినాయకుడైన ఈ క్షేత్రంలో  కొలువైన  పూజించి.  పునితుడయ్యాడు, వ్యాస మహర్షి  దక్షిణ యాత్ర ప్రారంభంలో   పార్వతి  తనయాలని  ప్రతిష్టించారని  చెబుతున్నారు. 

అతి పురాణతమైన   Ainavilli Sri Siddi Vinayaka Swamy Temple  అంటారు. కాణిపాకం ముందే సిద్ధి వినాయక స్వామి  ఆలయం  ఉంది.  అని ఇక్కడ గ్రామ పెద్దలు చెప్తూ ఉంటారు. వరాలు  ఇచ్చే  దేవుడు  సిద్ధి వినాయక దేవుడు అంటారు.

 అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం దర్శించు సమయాలు 

  • అయినవిల్లి శ్రీ  సిద్ధి వినాయక స్వామి  ఆలయంలో  తెల్లవారుజామున 5:00 am   నుండి 12:00 pm   వరకు  పూజా కార్యక్రమం  ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ సిద్ధి వినాయక స్వామి  విశ్రాంతి సమయంలో మధ్యాహ్నం 12:45 pm నుండి 3:45 pm వరకు  స్వామివారికి  విశ్రాంతి లేదు  బ్రేకింగ్ సమయాలు అంటారు.
  • అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం  సాయంకాలం 4:00 pm నుండి  రాత్రి 8:00 pm వరకు పూజ కార్యక్రమం జరుపుకుంటాయి.
  • శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు మొదటి గంట 6:00 am  నుండి ప్రారంభం అవుతుంది.
  • సిద్ధి వినాయక స్వామి వారి మొదటి దర్శనం 5:45 am  మధ్యనండి జరుగుతూ ఉంటుంది.
  • చిరు సిద్ధి వినాయక స్వామి వారు రెండవ గంట సాయంత్రం 4:45 pm ప్రారంభమవుతుంది.
  • శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు విశ్రాంతి  గడియలు రాత్రి 8:00 pm
  • నుండి  తెల్లవారుజామున  4:45 am వరకు విశ్రాంతి సమయాలు, స్వామివారికి ఉంటాయి. 
  • గణపతి హోమం  ఉదయం 7:30 am నుండి  11:45 am నిమిషాల వరకు  గణపతి హోమం జరుగుతూ ఉంటుంది.
  • అభిషేకం  ఉదయం   8: 35 am నుండి  అభిషేకాలు జరుగుతూ ఉంటాయి.
  • హారతి  ఉదయం  6:45 am  నిమిషాల నుండి  12:0 pm  వరకు  జరుగుతూ ఉంటుంది.  అభిషేకం ఓంకారేశ్వరుడుకు అభిషేకం ఉదయం 9:45 నిమిషాల నుండి  జరుగుతూ ఉంటుంది.

అయినవిల్లి వినాయక ఆలయం  ఆచారాల రేటు,(Ainavalli Vinayaka Temple Ritual Rate)

 శైవాగమం ప్రకారం ప్రతిరోజు అర్చనలు నిర్వహిస్తారు. శాస్త్ర ప్రకారం నిత్యం అభిషేకం చేస్తారు. తన భక్తుల కోరికలను త్వరగా తీర్చే సిద్ది వినాయకుడిని ప్రత్యక్షంగా ఆరాధించడానికి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు ఆలయానికి తరలివస్తారు. కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు మరియు సహజ పరిసరాల మధ్య ఉంచబడిన గణపతి విగ్రహం వద్ద భక్తులు పూజలు చేస్తారు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారని ప్రతిజ్ఞ చేస్తారు, ఇది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం మరియు ఆచారం ఈ దేవుని పేరు మీద వాగ్దానం చేయడం. చాలా పురాతనమైన ఈ ఆలయాన్ని పూర్వపు “దేవతలు” స్థాపించారని మన ప్రజల విశ్వాసం. కాలక్రమేణా పెద్దాపురం పాలకులు పునర్నిర్మాణం, పునర్నిర్మాణం మరియు అభివృద్ధి చేపట్టారు. ప్రస్తుతం ఆలయాన్ని దేవాదాయ శాఖ నిర్వహిస్తోంది

అయినవిల్లి శ్రీ వినాయక దేవాలయంలో పాలాభిషేకం మరియు అన్నదాన రేట్లు తెలుసుకుందాం.

  • అయినవిల్లి  సిద్ధి వినాయక అభిషేకం ధరలు, 150/-
  • శ్రీ లక్ష్మీ గణపతి హోమం ధరలు 300/-
  • లక్ష్మీ దర్వార్చన పూజ మరియు లక్ష్మీ గరిక పూజ ధరలు, 25/-
  • వినాయక చవితి పండ్లు పాలు అభిషేకం ధరలు, 250/-
  • తద్య అన్నదానం మరియు నిత్యా అన్నదానం ధరలు, 300/-
  • పెళ్లెవరోజు అన్నదానం ధరలు, 300/-
  • విశిష్ట మహారాజు పుష్కరాలు ధరలు, 100,000/-
  • మహారాజు  పుష్కరాలు ధరలు, 50000/-
  • రాజు పురస్కారాలు ధరలు, 25000/-
  • పురస్కారాలు ధరలు,  10000/-
  • దాతలు సేవ ధరలు, 1116/- 

అయినవల్లి సిద్ధి వినాయక ఆలయ చరిత్ర,(History of Ainavilli Siddhivinayak Temple)

  అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక  స్వామి వారు ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉంది. 100 శతాబ్దాల కింద ఈ ఆలయం చిన్న గుడి లాగా ఉండేది. క్రిష్ పూర్వం 9వ శతాబ్దంలో నీ ఆలయం గుడి నిర్మాణం ఉందని చెప్పుకోవచ్చు. చోళుల పాలనలో అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయం కొలువ ఉందని చెప్పవచ్చు. 650  నుండి 890  చోళుల పరిపాలల్లో ఈ గుడి నిర్మాణం కలిగి ఉంది.

శ్రీకృష్ణదేవరాయ కాలంలో అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి రెండు పురాణ స్థలాలు ఉన్నాయి తెలుసుకుందాం. 

మొదటి కథ ప్రకారం:-  గోదావరి నది యొక్క పచ్చని పొలాల మధ్య కోనసీమ ప్రాంతం వాస్తు శాస్త్రంలో వివరించిన పవిత్రతను మరియు పవిత్ర అనుభూతిని గుర్తు చేస్తుంది. కోనసీమలోని ఈ ప్రాంతంలో అయినవిల్లిలో "సిద్ది వినాయక దేవాలయం" ఉంది. దక్ష యజ్ఞం నిర్వహించే ముందు దక్ష ప్రజాపతి విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ప్రదేశంలో వినాయకుని పూజ చేయాలని భావించారు. ఇది ఇక్కడి "క్షేత్ర పురాణం"లో వ్రాయబడింది.

రెండవ కథ ప్రకారం:- వ్యాస మహర్షి తన దక్షిణాది పర్యటన ప్రారంభంలో పార్వతీ పుత్రుడిని ఈ ప్రదేశంలో ప్రతిష్టించాడని మరియు ఈ యుగంలో - "సిద్ది వినాయకుడు" తన భక్తుల కోరికలను తీర్చగలడని మరొక కథనం.

 ఎత్తైన ప్రాంతం, ఈ వినాయక దేవాలయం దక్షిణాభిముఖంగా విగ్రహంతో ఉంటుంది. రెండు గోపురాలు మరియు ద్వారాలతో, దక్షిణం నుండి వినాయకుడిని మరియు తూర్పు నుండి శ్రీ విశ్వేశ్వర స్వామిని దర్శించవచ్చు. అదే కాంపౌండ్‌లో శ్రీ దేవి, భూదేవి శ్రీ కేశవ స్వామితో కొలువై ఉన్నారు. పక్కనే శ్రీ అన్నపూర్ణాదేవి కొలువై ఉంది. పక్కనే శ్రీ కాలభైరవ స్వామి మరియు క్షేత్రపాలకులు ఉన్నారు.ప్రతి నెలా చవితి, దశమి, ఏకాదశి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి నవరాత్రులు, కార్తీక మాసం, సంక్రాంతి నాడు ప్రభ పండుగ, శివరాత్రి ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)



 అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయం విశిష్టత గురించి మరియు నిర్మాణం గురించి ఈరోజు చెప్పడం అయితే జరిగింది. పురాణం కాలం నుండి ఈ దేవాలయం 100 సంవత్సరాల కిందట నాలుగు రాయలు కప్పుబడి ఉన్న దేవాలయం కు చెప్పుకోవచ్చు. చిన్న దేవాలయం కూడా
అంటారు. ఈ దేవాలయం అభివృద్ధి పొందుతూ వచ్చింది.

ఈ ఆలయంలో గోడలు చాలా ఎత్తైన గోడలను చెప్పుకోవచ్చు. రాయితో కట్టిన దేవాలయం చాలా బలంగా ఎత్తైన ఉంటుంది బెల్లం సున్నం ద్రవ్యాలతో కట్టిన కట్టుబడుతూ గట్టిగా ఉంటుంది గోడలు. చాళుక్య రాజ్యల పరిపాలనలో ఈ దేవాలయం ఉందని జరిగింది 14వ శతాబ్దంలో పూజలు చేస్తూ ఉండాలని చెప్పుకోవచ్చు. ఆలయంలో నాలుగు గోపురాలు ఉన్నాయి గోపురాలు చుట్టూ శిల్పాలతో అందంగా ఉన్నాయి అవి ఓల్డ్ కలర్ రంగులో ఒక భాగం తెల్ల కలర్ సొగ భాగం ఉంటుంది. గజ స్తంభాలు 35 దాకా ఉంటాయి.

 వాటిపై శిల్పాలు చాలా చక్కగా గీశారు. స్ట్రక్చర్ కూడా చాలా అందంగా లైట్లు మరియు వైరింగ్ సెట్టింగ్స్ కూడా చాలానే బాగా వేశారు. దేవాలయం ఏ కలర్ లో ఉంటుందంటే తెలుపు రంగు కలర్ మరియు బంగారు కలర్ లో ఉంటుంది. గుడు చుట్ట ప్రాంతంలో కొండ శ్రేణులు మరియు పెద్ద పెద్ద చెట్లు నదులు వంటి సౌకర్యాలతో కలుగును ఈ దేవాలయం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు,చల్లని వాతావరణం ప్రదేశంలో తేలుతూ ఉంటాము.

 అందుబాటులో వున్నా వసతి అతిధి గృహాలు 

అమలాపురంలోని కొత్త కాటన్ గెస్ట్ హౌస్, పంచాయత్ రాజ్ డిపార్ట్‌మెంట్, అమలాపురంచే నియంత్రించబడుతుంది. సంప్రదించండి: 08856-231909

అమలాపురంలోని పంచాయత్రాజ్ అతిథి గృహం పంచాయత్రాజ్ శాఖ నియంత్రణలో, అమలాపురం. సంప్రదించండి: 08856-231442

పంచాయత్రాజ్ శాఖ, అమలాపురం నియంత్రణలో కొత్తపేటలోని పంచాయతీరాజ్ అతిథి గృహం. సంప్రదించండి: 08856-231442


అయినవిల్లి సిద్ధి వినాయక చేరే మార్గాలు,( Ways to reach Ainavilli Siddhivinayak)

రోడ్డు  మార్గం ,  

అయినవల్లి శ్రీ సిద్ది వినాయక స్వామివారుకు దర్శించడానికి రెండు ప్రాంతాల నుండి రోడ్డు మార్గం రవాణా సౌకర్యం కలిగి ఉందని చెప్పుకోవచ్చు.  ఆర్టీసీ బస్సు ప్రైవేట్ వెహికల్స్ జీప్ వంటి సౌకర్యాలతో రోడ్డు ప్రయాణం సాగు పంపవచ్చు మరియు దివ్య చక్ర వాహనాలు కూడా రోడ్డు ప్రయాణానికి పోవడానికి సౌకర్యం కలిగి ఉంది.

  • హైదరాబాదు నుండి అయినవిల్లి 460 km
  • బెంగళూరు నుండి అయినవిల్లి 448 km  
  • మంత్రాలయం నుండి అయినవిల్లి 695 km
  • కేరళ నుండి అయినవిల్లి 1268 km

రోడ్డు ప్రయాణం చేసేవారు అయినవల్లి శ్రీ సిద్ధ వినాయకుడి దేవాలయానికి పోవడానికి భక్తాదులు సులభమైన రవాణా సౌకర్యం ఉందని చెప్పడం జరిగింది.

రైలు మార్గం,

దక్షిణ భారతదేశంలో శ్రీ సిద్ధి వినాయక దేవాలయానికి  రైలు మార్గాలు సౌలభ్యం కలదు. ప్రాచీన
యుగం నుండే రైల్వే మార్గాలు దేవాలయానికి ఉండడానికి ముఖ్యమైన గమనిక చెప్పవచ్చు. మన రెండు ప్రాంతాల నుండి రైల్వే మార్గానికి సిద్ధి వినాయక దేవాలయానికి ఉంది.

  • హైదరాబాదు (HYD,SEC)
  • మంత్రాలయం (MALM)
  • బెంగళూరు (SBC)
  • కేరళ (TCR)

అయినవిల్లి సిద్ధి వినాయక దేవాలయానికి విమాన మార్గం చాలా సులువైన మార్గంలో ఉంది.అందుబాటులో ఉన్న ఎయిర్పోర్ట్స్ వైజాగ్, రాజమహేంద్రవరం.



 అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక  మరియు విఘ్నేశ్వర స్వామి వారు  దయగల దేవుడు  సిరి సంపద తో  భక్తాదులకు తోడుగా ఉంటారు.  పిల్లలు లేనివారు  ఇక్కడ వచ్చి పూజలు చేస్తే  సంతాన సౌభాగ్యం  కలుగుతుందని భక్తాదులు నమ్ముతారు.  

18, డిసెంబర్ 2024, బుధవారం

పళని మురుగన్‌ మహత్యం

 

పళని మురుగన్‌ మహత్యం

అంతుబట్టని నవ పాషాణం!


అటు చరిత్రకీ ఇటు శాస్త్రీయతకీ అందని అసాధారణ నైపుణ్యానికీ విజ్ఞానానికీ చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు.


వాస్తునిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటివాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం.




సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నులపండువగా జరుగుతుంది. అందులో పాల్గొన్నవాళ్లకి సంతానప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.


నిరవధికంగా పదహారు గంటలపాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాశి, అగ్నినక్షత్రం... ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేర రాజు చేరమాన్‌ పెరుమాళ్‌ పునర్నిర్మించినట్లూ ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లూ తెలుస్తోంది.


నిజానికి విగ్రహం క్రీ.పూ. మూడువేల సంవత్సరాలనాటిదనీ చాలాకాలం నిర్లక్ష్యానికి గురైందనీ, చేరమాన్‌ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు.ఆదిత్యయోగీ.


మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండమీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతోపాటు రోప్‌ వే లాంటి సౌకర్యమూ ఉంది. గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తాడు. 


"అన్నీ వదిలేసి నన్ను చేరుకో" 

అన్నదే స్వామి అలా కనబడటంలోని అంతరార్థమట. ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని దండాయుధపాణి, బాల సుబ్రహ్మణ్యం, మురుగన్‌, శరవణన్‌... ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు.


"స్థలపురాణం"

ప్రమద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి, నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకుని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకూ అధిపతివి నీవే అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందించారట. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండమీదే కొలువుంటానని తల్లితండ్రులకు చెబుతాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి జ్ఞానం సిద్ధిస్తుందనీ శివుడు వరమిస్తాడట. తమిళంలో 'పళం' అంటే 'ఫలం', 'నీ' అంటే 'నీవు' అని అర్థం. అందుకే ఇది పళని అయ్యిందట.


కావడీ ఉత్సవం!

దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే, ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరినవాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి, కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడిలో భూమిమీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువవడంతో- కావడిని కిందపెట్టి సేదతీరతాడు ఇడుంబుడు. కావడిని మళ్లీ పైకెత్తబోతే అది లేవదు సరికదా, అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు- కొండమీదకి పరుగెడతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి, మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి, కావడీలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్ళకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. 'నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తార'నీ చెబుతాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పూలు... వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందనీ దాంపత్య దోషాలు తొలగిపోతాయనీ నమ్ముతారు.


ఏమిటీ నవ పాషాణం!

పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు. ఆలయంలోని మూలవిరాట్టుని దర్శించుకుని, తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులూ తొలగిపోతాయని నమ్మేవారు.


దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడి స్వామి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో "భోగర్‌" అనే సిద్ధుడు తయారుచేశాడట. అందుకే దీన్ని నవ పాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, తొమ్మిది అనీ; పాషాణ అంటే విషం, ఖనిజం అనీ అర్థాలు ఉన్నాయి. భోగర్‌ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటినుంచి తొమ్మిది విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారుచేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో తొమ్మిదింటిని సేకరించి ఈ నవపాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధగుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలూ పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరువు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్టురోగం నయమయ్యేదని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోతుండటంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేదం (చెమట) పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందనీ, గంధంతోపాటు కారే నీటిచుక్కలు ఆకుపచ్చరంగులో ఉంటాయనీ అంటారు. వీటిని ఒడిసిపట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీనతీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అయితే విగ్రహాన్ని లక్షలకొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారనీ, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడంవల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్లి వాటి సంఖ్య పెరగడంవల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన.ఆదిత్యయోగీm


"ఎవరీ సిద్ధ భోగర్‌?"

క్రీ.పూ. 550-300 కాలానికి చెందిన భోగర్‌ పళని కొండల సమీపంలోని వైగావూర్‌లో జన్మించాడు. ఈయన తన తల్లి, తాతల దగ్గర విద్యను అభ్యసించి, కాలంగి నాథర్‌ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడనీ ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కారణమేంటనేది తెలిసేది కాదు. దాంతో భోగర్‌ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్‌ విగ్రహాన్ని రూపొందించి, పూజించాడట. కన్నివాడిలోని మైకంద సిద్ధర్‌ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్‌ దీన్ని తయారుచేసి, పళని కొండమీద ప్రతిష్ఠించాడనీ, ఆపై విగ్రహాన్ని పాలూ పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడనీ చెబుతారు. విగ్రహం ఉన్న కొండ కింద గుహలోనే భోగర్‌ జీవసమాధిలోకి వెళ్లినట్లు చెబుతారు.


తమిళనాట పేరొందిన పద్ధెనిమిది మంది సిద్ధుల్లో కాలంగి నాథర్‌ ఒకరు. గురువైన కాలంగి నాథర్‌ చివరి కోరిక మేరకు భోగర్‌ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్లినట్లూ; శ్రీలంక మీదగా తామ్రపర్ణియన్‌ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లూ సప్తకందలో రాసుకున్నాడు. పులిప్పాని వంశీకులు పదహారో శతాబ్దం వరకూ ఈ ప్రాంతంలో ఉండేవారనడానికి ఆధారాలున్నాయి. పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు. కానీ ఏమిటనేది తెలియలేదు. అయితే "గట్టి లింగం, గుర్రంపన్ను, నల్ల పాషాణం, రస సింధూరం, తెల్ల పాషాణం, రక్త పాషాణం, కంబి నవరసం, కౌరి పాషాణం, సీలై పాషాణం" ఇలా తొమ్మిది రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహాన్ని తయారుచేశారని కొందరంటారు. ఆ మూలికలకోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారనీ అంటారు. 


అందుకే... పళని మురుగన్‌ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం..!


పంచామృతం!

లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తుకొచ్చినట్లే, పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తుకొచ్చేది పళని సుబ్రహ్మణ్యస్వామే. మహత్తరమైన రుచీ ఔషధ, పోషక గుణాలున్న ప్రసాదం. ఇది కొన్ని నెలలు నిల్వ ఉంటుందట. ఎంత పాతబడితే అంత రుచి అనీ అంటారు. అందుకే స్వామివారి దర్శనానంతరం ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండల్లోని విరుప్పాచ్చి అనే ఊళ్లో మాత్రమే పండే వేలెడంత సైజు తియ్యని అరటిపండ్లను చిదిమి దానికి కంజీయం ప్రాంతంలో పండించే చెరకుతో చేసిన ముడి పంచదార చేర్చి, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, యాలకులు, నెయ్యి సరైన పాళ్లలో కలిపి తయారుచేస్తారు....*






12, డిసెంబర్ 2024, గురువారం

🌳గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీయాలి?

 🌳గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీయాలి?

       


పార్వతీదేవి, శ్రీమహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తనచేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. 


అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చట్టుక్కున నోట్లో వేసుకుని, మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. 


‘ఏం వెతుకుతున్నావు మావయ్యా!’ అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు.


’ఇంకెక్కడుంది మావయ్యా చక్రం! నేను తినేశాగా!’ అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహాఇష్టం. గణపతిని ఏమి అనలేడు. అందువల్ల ‘బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహాసుదర్శనం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా’ అని నానారకాలుగా బ్రతిమాలాడు విష్ణువు. 


గణపతి పట్టువదల్లేదు.ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడిచెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్ళు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా, విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పించేంతగా నవ్వాడు.


ఇలా నవ్వడంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుంచి గణపతి ముందు గుంజీళ్ళు తీసే సంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే. 


ఈ విధంగా శ్రీమహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీళ్ళలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది.


జయ గణేష పాహిమాం!  జయ గణేష రక్షమాం!!

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...