పోస్ట్‌లు

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

చిత్రం
  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. 🌿ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం. 🌸మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి.  🌿మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. 🌸నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు. 🌿18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాద...

ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!

చిత్రం
  ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'! శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.  ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి.  ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉంది.  ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాత: సంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది.  ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు. ప్రశాంతమైన ప్రాత: కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం.  అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు.  ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో, ద్వారక నుండి స...

కోనసీమ ! మూడు వైపులా నీరు మధ్యలో గోదావరి డెల్టా ప్రాంతం

చిత్రం
  కోనసీమ కోనసీమ ! మూడు వైపులా నీరు మధ్యలో గోదావరి డెల్టా ప్రాంతం ! కోనసీమ డెల్టా చుట్టూ, రెండు వైపులా గోదావరి పాయలైన వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి, గౌతమి, నీలరేవు వున్నాయి. ఒక ప్రక్క సముద్రం ఉంది, రాజమండ్రి నగరాన్ని దాటిన తరువాత గోదావరి వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి పాయలుగా చీలుతుంది. వృద్ధ గోదావరి గౌతమి, నీలరేవుగా, వశిష్ట గోదావరి వశిష్ట, వైనతేయ గా చీలుతుంది. ఈ పాయలు బంగాళాఖాతం తీరంలో170 కి.మీ పొడవైన పరివాహక ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. దీనినే కోనసీమ ప్రాంతం అంటారు. కోనసీమలో అమలాపురం అతి పెద్ద పట్టణం. దీని తరువాత స్థాయిలో రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం వున్నాయి. ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' ! కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. పచ్చని తీవాచీ పరిచినట్లుంటే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశిష్టంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగా...

తిరుమల శ్రీవారి ఆలయం… ఏడుకొండలపై ఉందని అందరికీ తెలుసు. మరి ఆ ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు

చిత్రం
  తిరుమల శ్రీవారి ఆలయం… ఏడుకొండలపై ఉందని అందరికీ తెలుసు. మరి ఆ ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు..? ఆ ఏడు మార్గాల్లో… ఏ దారి నుంచి వెళ్లినా… తిరుమల చేరుకోవచ్చు. ఆ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల. ఏడుకొండలపై కొలువైన శ్రీనివాసుడిని ఒక్క క్షణమైనా కళ్లారా చూస్తే చాలని భక్తులు పరితపిస్తుంటారు. రోజూ వేలాది మంది తిరుమలకు క్యూకడుతుంటారు. తిరుపతి చేరుకున్నాక… తిరుమల కొండకు వెళ్లేందుకు… బస్సులు, ప్రైవేట్‌ జీపులు, టాక్సీలను ఆశ్రయిస్తారు. కొంతమంది అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గం నుంచి కాలినడకన వెళ్తుంటారు. ఇవి కాకుండా… తిరుమల వెళ్లేందుకు ఇంకొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయి. వాటిలో మొదటిది అలిపిరి. ఇది అందరికీ తెలిసిన దారే. తిరుమల వెళ్లేందుకు ప్రధాన మార్గం కూడా ఇదే. బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్‌ జీపులు… అన్నీ అలిపిరి నుంచే వెళ్తాయి. కాలినడకన కొండెక్కేవారు మొదట ఎంచుకునేది కూడా అలిపిరి మార్గమే. ఎందుకంటే ఇది… తాళ్లపాక అన్నమాచార్య నడిచిన మార్గం. ఈ మార్గంలో త...

శృంగార వల్లభ స్వామి దేవాలయం, తోలి తిరుపతి, ఆంధ్రప్రదేశ్

చిత్రం
 శృంగార వల్లభ స్వామి దేవాలయం,  తోలి తిరుపతి, ఆంధ్రప్రదేశ్ శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం తిరుపతి గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ మరియు కాకినాడ నుండి ఉత్తరం వైపు 27 కి.మీ మరియు దివిలి నుండి ఒక కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని తొలి తిరుపతి (మొదటి తిరుపతి అని అర్ధం) అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఉన్న ఆలయం 9000 సంవత్సరాల పురాతనమైనది మరియు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న భగవాన్ బాలాజీ ఆలయం కంటే పురాతనమైనది. తోలి తిరుపతి గ్రామాన్ని చదలాడ (వాస్తవానికి చదలవాడ అని పిలుస్తారు) అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న భగవాన్ విష్ణు విగ్రహం వెంకటేశ్వర స్వామి చిరునవ్వుతో దర్శనమిస్తుంది కాబట్టి దీనికి శృంగార వల్లభ స్వామి అని పేరు వచ్చింది. స్థల పురాణం ఈ ఆలయ పురాణం విష్ణువు మరియు భాగవత పురాణాలలో ప్రస్తావించబడిన దృవానికి జోడించబడింది. ఉత్తానపాద రాజుకు ఇద్దరు భార్యలు సునీతి మరియు సురుచి. సునీతి కుమారుడు దృవుడు మరియు సురుచి కుమారుడు ఉత్తముడు.  సురుచి యవ్వనంగా మరియు చాలా అందంగా ఉంది మరియు ఆమె కుమారుడు ఉత్తముడు దృవుని కంటే చిన్నవాడు. సురుచి దృవున...

స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం

చిత్రం
  స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం ఆలయం గురించి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామంలో ఉంది. ఈ పురాతన గణేశ దేవాలయాన్ని కాణిపాకం వినాయక దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభూ, స్వయంభువు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీ వినాయక విగ్రహం పరిమాణం రోజురోజుకు పెరుగుతోంది. కలియుగం ముగిసే వరకు ఈ విగ్రహం పరిమాణం పెరుగుతుందని, ఆపై శ్రీ వినాయకుడు ప్రత్యక్షమవుతాడని నమ్ముతారు. శ్రీ వరసిద్ధి వినాయకుడు వెలిసిన బావి ఇప్పటికీ ఆలయంలో ఉంది. ఈ ఆలయంలో బావిలోని పవిత్ర జలాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. 11వ శతాబ్దం CE ప్రారంభంలో చోళ రాజు కులోత్తుంగ చోళుడు-I చేత నిర్మించబడిన ఈ ఆలయం 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనదిగా నమ్ముతారు. ప్రస్తుత కాణిపాకం గ్రామం పూర్వకాలంలో "విహారపురి" అని పిలువబడేది. "కాని" అంటే ఒక వంతు భూమి మరియు "పాకం" అంటే భూమిలోకి నీరు వెళ్లింది అంటే నీటిపారుదల. దీని యొక్క సూచన కణిపారకంగా గుర్తించబడింది - చివరికి కాణిపాకం అని పిలుస్తుం...

అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం – చరిత్ర, విశేషాలు, దర్శన సమయాలు, సేవలు, చేరుకునే మార్గం | పూర్తి యాత్రా మార్గదర్శిని

చిత్రం
  “ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరినకోర్కెలు తీర్చేస్వామి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి.” అయినవిల్లి సిద్ధి వినాయక  స్వామి వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో అయినవిల్లి గ్రామం లో శ్రీ సిరి సిద్ద వినాయక స్వామి ఆలయం కొలువై  ఉంది.  నిత్యం  భక్తాదులు రాకపోకుతో  ఈ దివ్య క్షేత్రం లో ఉండే  సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు. పవిత్రమైన గోదావరి  నది ఒడ్డున అమీరిన కోలసీమ  లో అడుగడుగునా దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కోలసీమలో  అయినవిల్లి  శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఆలయం ఉంది. దక్షిణ దక్ష ప్రదాపతి దక్షయజ్ఞం  చేసే ముందు  విజ్ఞ వినాయకుడైన ఈ క్షేత్రంలో  కొలువైన  పూజించి.  పునితుడయ్యాడు, వ్యాస మహర్షి  దక్షిణ యాత్ర ప్రారంభంలో   పార్వతి  తనయాలని  ప్రతిష్టించారని  చెబుతున్నారు.  అతి పురాణతమైన      Ainavilli Sri Siddi Vinayaka Swamy Temple    అంటారు. కాణిపాకం ముందే సిద్ధి వినాయక స్వామి  ఆలయం  ఉంది.  అని ఇ...