Architecture లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Architecture లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, డిసెంబర్ 2024, శనివారం

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

 



తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం.


🌿ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం.



🌸మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. 


🌿మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు.


🌸నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.


🌿18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి


🌸ధృవబేరం చక్కని ముఖకవళికలతో వెలసి ఉంటుంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది.


🌿నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, సైజూ వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా కచ్చితంగా పాటిస్తారు. 


🌸స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం ఉంది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. 


🌿కచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36-40 అంగుళాల మధ్య సైజులోనూ, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు సైజులోనూ ఉంటుంది. 


🌸స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది.


🌿స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. 


🌸అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది).


🌿ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉంది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు.


🌸రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి (స్వామివారు భక్తుల రక్షణకు నడచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా). 


🌿స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి.. సేకరణ... స్వస్తి...🚩🌞🙏🌹🎻

27, డిసెంబర్ 2024, శుక్రవారం

కోనసీమ ! మూడు వైపులా నీరు మధ్యలో గోదావరి డెల్టా ప్రాంతం

 

కోనసీమ



కోనసీమ ! మూడు వైపులా నీరు మధ్యలో గోదావరి డెల్టా ప్రాంతం !


కోనసీమ డెల్టా చుట్టూ, రెండు వైపులా గోదావరి పాయలైన వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి, గౌతమి, నీలరేవు వున్నాయి. ఒక ప్రక్క సముద్రం ఉంది, రాజమండ్రి నగరాన్ని దాటిన తరువాత గోదావరి వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి పాయలుగా చీలుతుంది. వృద్ధ గోదావరి గౌతమి, నీలరేవుగా, వశిష్ట గోదావరి వశిష్ట, వైనతేయ గా చీలుతుంది. ఈ పాయలు బంగాళాఖాతం తీరంలో170 కి.మీ పొడవైన పరివాహక ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. దీనినే కోనసీమ ప్రాంతం అంటారు.


కోనసీమలో అమలాపురం అతి పెద్ద పట్టణం. దీని తరువాత స్థాయిలో రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం వున్నాయి.


ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' ! కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం.


కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. పచ్చని తీవాచీ పరిచినట్లుంటే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశిష్టంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది.


 కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి.


 ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. 


కోనసీమలో ఉన్న ప్రధాన ప్రదేశాలు అమలాపురం, రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం,ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట. రాజమండ్రి కోనసీమకు పక్కనే పెద్ద నగరం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోనసీమ అందాలను, ఇక ఆలస్యం చేయకుండా కోనసీమ అందాలు తెలుసుకొందామా ..!


కోనసీమ అందాలు

మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు ,పచ్చని చెట్ల తోరణాలు ,అరటి గెలలు, కొబ్బరి తోటలు , మంచు తెరలు మనోహర దృశ్యాలు, రంగవల్లులు కోడిపందాలు ,అంతర్వేదిలో గోదావరి సాగరసంగమంలో పడవ ప్రయాణం మరపురాని ఒక మధురానుభవం. పచ్చని పంట పొలాలు... ఆకాశాన్ని తాకేలా పెరిగిన కొబ్బరిచెట్లు...పుష్కలమైన ప్రకృతివనరులు. కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం. ఇవన్నీ కోనసీమ అందాలు.


పంటపొలాలు

కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.


సంస్కృతి - సంప్రదాయాలు - పండుగలు


కోనసీమ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ - సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. తెలుగు సంవత్సరాది ఉగాది, సంక్రాంతి కోనసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలు.


పలకరింపులు

కోనసీమ పలకరింపులు భలేగా ఉన్నాయి. చాలా సినిమాలలో అబ్సర్వ్ చెసింటారనుకోండి ..! 


ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. సంప్రదాయ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే కోనసీమ రాక తప్పదు. ఎవరు కనబడినా ఆప్యాయంగా పలకరించడం వారి సంస్కారం. ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారో అని అడిగి తెలుసుకోవడం వారికి పుట్టుకతో వచ్చిన గుణం. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందర్నీ గౌరవంగా, ఆప్యాయంగా పలకరించే సంస్కారం వారి సొంతం


దేవాలయాలు


కోనసీమ ప్రాంతంలో పర్యాటకులు ఎన్నో దేవాలయాలను చూడవచ్చు. వాటిలో ప్రధానమైనవి 

1.మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి 

2.ర్యాలీ లో గల జగన్మోహిని కేశవ స్వామి గుడి

3. ముక్తేశ్వరం లోని క్షణ ముక్తేశ్వరాలయం 

4.పలివెల లోని శ్రీ ఉమాకొప్పు లింగేశ్వర ఆలయం 

5.మందపల్లి లోని శనీశ్వర ఆలయం

6.అయినవిల్లిలోని విఘ్నేశ్వరస్వామి దేవాలయం

7. రాజోలు పట్టణ సమీపములో బి.సావరం(కస్తూరి వారి సావరం)

ఉమా సోమేశ్వర స్వామి క్షేత్రం 


ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి


రావులపాలెం

రావులపాలెం కోనసీమ అరటిపండ్ల మార్కెట్ కి ప్రధాన కేంద్రం. దీనిని కోనసీమకు ముఖద్వారం అని పిలుస్తారు.


అమలాపురం

అమలాపురం కోనసీమలో ప్రస్తుతం కోనసీమ జిల్లా కేంద్రం 


కాకినాడకు 65 కి. మీ ల దూరంలో కలదు . అమలేశ్వరస్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, అయ్యప్పస్వామి, షిర్డీ సాయి స్వర్ణ మందిరం చూడదగ్గవిగా ఉన్నాయి.


కోనసీమ వంటలు

కోనసీమ వంటలు ఆహా ..! అనిపించకమానవు.  అట్లు, మినపట్టు,పెసరెట్టు టిఫిన్ కు బాగుంటాయి. మధ్యాహ్నం లంచ్ కి పిక్కల్(చట్నీలు) లేకుండా ఇక్కడి వారి భోజనం పూర్తికాదు. ఇక్కడికి వెళితే పూతరేకులు తప్పక తినండి.


గోదావరి అందాలు

గోదావరి నది పై వంతెనలు నిర్మించక ముందు ప్రజారవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. గోదావరి నదిలో సుమారు 10-20 నిమిషాల లాంచీ ప్రయాణం (కోనసీమ పరిసర ప్రాంతాలలో .. ) పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.


పాపికొండల ప్రయాణం

కోనసీమ నుండి పాపికొండల ప్రయాణం అనుభూతి వర్ణించలేనిది. బిజీ లైఫ్ నుండి రిలీఫ్ కాలావనుకొనేవారికి ఈ ప్రయాణం అనుకూలం.


కోనసీమ పర్యాటకం

కోనసీమ పర్యాటకం పర్యాటకులను ఆకర్శించటానికి ఎన్నోయాత్రలను అందిస్తున్నది. పాపికొండలు, మారేడుమిల్లి, మంగ్రోవ్ ఫారెస్ట్ ఇక్కడి సమీప అందాలు.ఇక్కడికి వెళ్ళటానికి టూర్ ప్యాకేజీలను, వసతి కై రిసార్ట్ లు అనేకం కలవు.


సినిమా షూటింగ్లు

కోనసీమ సినిమా షూటింగ్ లకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఇక్కడ ఎన్నో టాలీవూడ్ సినిమా లు చిత్రీకరించారు.


కోనసీమ చేరుకోవటం ఎలా ?

వాయు మార్గం : కోనసీమ చేరుకోవటానికి సమీపాన రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కలదు.

రైలు మార్గం : కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, కోటిపల్లి, గంగవరం, పాలకొల్లు, నరసాపూర్ రైల్వే స్టేషన్ లు కలవు.


బస్సు / రోడ్డు మార్గం : హైదరాబాద్ నుండి కోనసీమలోని ప్రతి నగరానికీ బస్సు సర్వీసులు కలవు.


 రాజమండ్రి కోనసీమకు ప్రక్కనే కల పెద్ద నగరం. 

రాజమండ్రి కి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుండి కోనసీమప్రాంతాలకు ఆర్డినరీ బస్సు సర్వీసుల ద్వారా చేరుకోవచ్చు.


Credits : DrAyodhya Sarma Kasturi 

26, డిసెంబర్ 2024, గురువారం

శృంగార వల్లభ స్వామి దేవాలయం, తోలి తిరుపతి, ఆంధ్రప్రదేశ్

 శృంగార వల్లభ స్వామి దేవాలయం, 

తోలి తిరుపతి, ఆంధ్రప్రదేశ్




శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం తిరుపతి గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ మరియు కాకినాడ నుండి ఉత్తరం వైపు 27 కి.మీ మరియు దివిలి నుండి ఒక కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని తొలి తిరుపతి (మొదటి తిరుపతి అని అర్ధం) అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఉన్న ఆలయం 9000 సంవత్సరాల పురాతనమైనది మరియు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న భగవాన్ బాలాజీ ఆలయం కంటే పురాతనమైనది. తోలి తిరుపతి గ్రామాన్ని చదలాడ (వాస్తవానికి చదలవాడ అని పిలుస్తారు) అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న భగవాన్ విష్ణు విగ్రహం వెంకటేశ్వర స్వామి చిరునవ్వుతో దర్శనమిస్తుంది కాబట్టి దీనికి శృంగార వల్లభ స్వామి అని పేరు వచ్చింది.

స్థల పురాణం

ఈ ఆలయ పురాణం విష్ణువు మరియు భాగవత పురాణాలలో ప్రస్తావించబడిన దృవానికి జోడించబడింది. ఉత్తానపాద రాజుకు ఇద్దరు భార్యలు సునీతి మరియు సురుచి. సునీతి కుమారుడు దృవుడు మరియు సురుచి కుమారుడు ఉత్తముడు.  సురుచి యవ్వనంగా మరియు చాలా అందంగా ఉంది మరియు ఆమె కుమారుడు ఉత్తముడు దృవుని కంటే చిన్నవాడు. సురుచి దృవుని చూసి అసూయపడి ఉత్తానపాదుడి తర్వాత తన కొడుకు ఉత్తముడిని రాజుగా చేయాలని కోరుకుంది. దృవుడు చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు ఒకరోజు, ఉత్తముడు తన తండ్రి ఒడిలో కూర్చోవడం చూసి, అతను కూడా కూర్చోవడానికి వెళ్తాడు. సురుచి దృవుడిని దూరంగా నెట్టివేసి, అతను తన కొడుకుగా పుట్టలేదు కాబట్టి, తన తండ్రికి దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు. కలత చెందిన దృవ తన తల్లి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతాడు. సునీతి దృవతో భగవాన్ విష్ణువు అత్యంత శక్తిమంతుడని మరియు భగవాన్ విష్ణువు యొక్క ఆశీర్వాదాలను పొందమని అతనికి సలహా ఇస్తుంది. దృవ భగవాన్ విష్ణు ఆశీస్సులు తీసుకోవడానికి బయలుదేరాడు. నారద ముని అతనిని చూసి, 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని జపించమని ధృవుడికి సలహా ఇస్తాడు. దృవుడు ఆరు నెలల పాటు తీవ్రమైన తపస్సు చేస్తాడు మరియు విష్ణువు అతని ముందు ప్రత్యక్షమవుతాడు. దృవుడు అతని భారీ రూపం మరియు తేజస్సు కారణంగా విష్ణువును చూడలేకపోయాడు. ఇది గ్రహించిన భగవాన్ చిన్నపిల్లల పరిమాణానికి వచ్చి దృవుడిని చూడమని అడుగుతాడు. భగవాన్ తనను చూడాలనుకునేవారి పరిమాణంలో ఉంటానని ఆశీర్వదిస్తాడు. భగవాన్ విష్ణువు ధృవుడిని అనుగ్రహించిన ప్రదేశం తొలి తిరుప్తి అని నమ్ముతారు.

ఈ ఆలయం ద్రావిడ వాస్తుశిల్పంలో తూర్పు చాళుక్యులు (7వ మరియు 12వ శతాబ్దాల మధ్య పాలించినవారు) నిర్మించారు. ప్రధాన విగ్రహం లేదా మూల విరాట్ అనేది శృంగార వల్లభ స్వామి రూపంలో ఉన్న భగవాన్ విష్ణువు అతని భార్యలు శ్రీ దేవి మరియు భూ దేవి.  ప్రవేశద్వారం వద్ద శేషతల్పంపై విష్ణువు లక్ష్మీదేవి, బ్రహ్మ మరియు నారదులతో కనిపిస్తారు. ప్రధాన ద్వారం ముందు రెండు వైపులా మండపం ఉంది. గర్భగృహ (అభయారణ్యం) చేరుకోవడానికి 7 ద్వారములు (ప్రవేశాలు) ఉన్నాయి. 
మొదటి మరియు రెండవ ద్వారం దాటిన తర్వాత ద్వాజస్తంభం ఉన్న బయటి ప్రాకారంలోకి వస్తారు. మూర్తి యొక్క అసలు పరిమాణంతో సంబంధం లేకుండా, యాత్రికుడు ద్వజస్తంభం వద్ద నిలబడితే (అంతేకాక, గర్భాలయానికి ప్రధాన ద్వారం వద్ద ఆలయం లోపల కమలం గుర్తుతో గుర్తించబడిన నిర్దిష్ట స్థానం నుండి చూసినప్పుడు), ప్రధాన విగ్రహం అదే విధంగా కనిపిస్తుంది. వీక్షకుడి ఎత్తు (యాత్రికుడి ఎత్తుతో సంబంధం లేకుండా). ఇది ఒక ప్రత్యేకమైన ఇంజనీరింగ్ అద్భుతం. ఆలయం వద్ద ఉన్న స్తంభాలపై పురాతన శాసనాలు ఉన్నాయి. తిరుపతికి చెందిన భగవాన్ బాలాజీతో పోల్చి చూస్తే, ఈ ఆలయంలో దేవతపై శంఖం మరియు చక్రం మార్చబడిన స్థానాల్లో ఉన్నాయి. భగవాన్ అవతరించిన తరువాత, దేవతలు ఆలయాన్ని నిర్మించారని మరియు నారద మహర్షి లక్ష్మీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. తరువాతి సంవత్సరాలలో, శ్రీ కృష్ణ దేవరాయ చక్రవర్తి తన పర్యటన సందర్భంగా భూదేవి దేవత యొక్క రాగి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. 
చక్రవర్తులు భోజ మహారాజ్, విక్రమార్క మరియు కాకతీయ రాణి రుద్రమ దేవి మరియు అనేక మంది రాజులు ఈ ఆలయాన్ని సందర్శించారని కూడా చెబుతారు. ఆలయ ఆవరణలో ఉన్న బావి వేసవిలో కూడా నీటితో నిండి ఉంటుంది మరియు ఎప్పటికీ ఎండిపోదు. ప్రతి సంవత్సరం చైత్ర సుద్ద ఏకాదశి నాడు భగవాన్ కల్యాణం నిర్వహిస్తారు మరియు ఆ తర్వాత ఆరు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. 
ఒక నక్షత్ర మండపం ఉంది, ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు (మొత్తం 27 నక్షత్రాలు) గర్భాలయానికి ఉత్తరం వైపున, బావికి ఆనుకుని ఉంది.  క్వీన్ విక్టోరియా ఈ ఆలయాన్ని సందర్శించి భగవాన్‌కు వెండి కవచాన్ని సమర్పించిందని చెబుతారు. ఆళ్వార్లకు ప్రత్యేక విగ్రహాలు ఉన్నాయి (ఆళ్వార్లు తమిళ కవి - భగవాన్ విష్ణువు పట్ల భక్తిని చాటుకున్న సాధువులు మరియు భగవాన్ విష్ణువును కీర్తిస్తూ కీర్తనలు పాడారు. దివ్య ప్రబంధం వలె) భక్తి ఉద్యమం వెనుక ఉత్ప్రేరకాలుగా పరిగణించబడ్డారు. ఆళ్వార్లు 5వ శతాబ్దం మరియు 9వ శతాబ్దం CE మధ్య జీవించారు. సాధారణంగా భగవాన్ విష్ణువు యొక్క అవతారం స్వయంభూ (స్వయంగా) ఉన్న వైష్ణవ దేవాలయాలలో ఆళ్వార్ల విగ్రహాలు కనిపిస్తాయి.   
భగవాన్ శివుడు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు మరియు శివాలయం ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉంది.

తిరుపతి శృంగార వల్లభ ఆలయానికి ఎలా చేరుకోవాలి:

రైలు మార్గం: 
తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయం చుట్టూ 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి మరియు అవి సామర్లకోట జంక్షన్ 14 కి.మీ, పెద్దాపురం 14 కి.మీ మరియు కాకినాడ 28 కి.మీ. 
రోడ్డు మార్గం: 
తిరుపతి చుట్టూ 3 ప్రధాన బస్ స్టేషన్లు ఉన్నాయి. వల్లభ స్వామి దేవాలయం - పెద్దాపురం 11 కి.మీ, సామర్లకోట 14 కి.మీ మరియు కాకినాడ 28 కి.మీ. 
విమాన మార్గం: 
రాజమండ్రి విమానాశ్రయం, 50 కి.మీ, విశాఖపట్నం విమానాశ్రయం, 152 కి.మీ మరియు విజయవాడ విమానాశ్రయం (గన్నవరం), 184 కి.మీ.

25, డిసెంబర్ 2024, బుధవారం

Ainavilli Sri Siddi Vinayaka Swamy Temple,(అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం)

 


“ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరినకోర్కెలు తీర్చేస్వామి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి.”

అయినవిల్లి సిద్ధి వినాయక  స్వామి వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో అయినవిల్లి గ్రామం లో శ్రీ సిరి సిద్ద వినాయక స్వామి ఆలయం కొలువై  ఉంది.  నిత్యం  భక్తాదులు రాకపోకుతో  ఈ దివ్య క్షేత్రం లో ఉండే  సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు.

పవిత్రమైన గోదావరి  నది ఒడ్డున అమీరిన కోలసీమ  లో అడుగడుగునా దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కోలసీమలో  అయినవిల్లి  శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఆలయం ఉంది. దక్షిణ దక్ష ప్రదాపతి దక్షయజ్ఞం  చేసే ముందు  విజ్ఞ వినాయకుడైన ఈ క్షేత్రంలో  కొలువైన  పూజించి.  పునితుడయ్యాడు, వ్యాస మహర్షి  దక్షిణ యాత్ర ప్రారంభంలో   పార్వతి  తనయాలని  ప్రతిష్టించారని  చెబుతున్నారు. 

అతి పురాణతమైన   Ainavilli Sri Siddi Vinayaka Swamy Temple  అంటారు. కాణిపాకం ముందే సిద్ధి వినాయక స్వామి  ఆలయం  ఉంది.  అని ఇక్కడ గ్రామ పెద్దలు చెప్తూ ఉంటారు. వరాలు  ఇచ్చే  దేవుడు  సిద్ధి వినాయక దేవుడు అంటారు.

 అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం దర్శించు సమయాలు 

  • అయినవిల్లి శ్రీ  సిద్ధి వినాయక స్వామి  ఆలయంలో  తెల్లవారుజామున 5:00 am   నుండి 12:00 pm   వరకు  పూజా కార్యక్రమం  ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ సిద్ధి వినాయక స్వామి  విశ్రాంతి సమయంలో మధ్యాహ్నం 12:45 pm నుండి 3:45 pm వరకు  స్వామివారికి  విశ్రాంతి లేదు  బ్రేకింగ్ సమయాలు అంటారు.
  • అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం  సాయంకాలం 4:00 pm నుండి  రాత్రి 8:00 pm వరకు పూజ కార్యక్రమం జరుపుకుంటాయి.
  • శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు మొదటి గంట 6:00 am  నుండి ప్రారంభం అవుతుంది.
  • సిద్ధి వినాయక స్వామి వారి మొదటి దర్శనం 5:45 am  మధ్యనండి జరుగుతూ ఉంటుంది.
  • చిరు సిద్ధి వినాయక స్వామి వారు రెండవ గంట సాయంత్రం 4:45 pm ప్రారంభమవుతుంది.
  • శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు విశ్రాంతి  గడియలు రాత్రి 8:00 pm
  • నుండి  తెల్లవారుజామున  4:45 am వరకు విశ్రాంతి సమయాలు, స్వామివారికి ఉంటాయి. 
  • గణపతి హోమం  ఉదయం 7:30 am నుండి  11:45 am నిమిషాల వరకు  గణపతి హోమం జరుగుతూ ఉంటుంది.
  • అభిషేకం  ఉదయం   8: 35 am నుండి  అభిషేకాలు జరుగుతూ ఉంటాయి.
  • హారతి  ఉదయం  6:45 am  నిమిషాల నుండి  12:0 pm  వరకు  జరుగుతూ ఉంటుంది.  అభిషేకం ఓంకారేశ్వరుడుకు అభిషేకం ఉదయం 9:45 నిమిషాల నుండి  జరుగుతూ ఉంటుంది.

అయినవిల్లి వినాయక ఆలయం  ఆచారాల రేటు,(Ainavalli Vinayaka Temple Ritual Rate)

 శైవాగమం ప్రకారం ప్రతిరోజు అర్చనలు నిర్వహిస్తారు. శాస్త్ర ప్రకారం నిత్యం అభిషేకం చేస్తారు. తన భక్తుల కోరికలను త్వరగా తీర్చే సిద్ది వినాయకుడిని ప్రత్యక్షంగా ఆరాధించడానికి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు ఆలయానికి తరలివస్తారు. కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు మరియు సహజ పరిసరాల మధ్య ఉంచబడిన గణపతి విగ్రహం వద్ద భక్తులు పూజలు చేస్తారు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారని ప్రతిజ్ఞ చేస్తారు, ఇది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం మరియు ఆచారం ఈ దేవుని పేరు మీద వాగ్దానం చేయడం. చాలా పురాతనమైన ఈ ఆలయాన్ని పూర్వపు “దేవతలు” స్థాపించారని మన ప్రజల విశ్వాసం. కాలక్రమేణా పెద్దాపురం పాలకులు పునర్నిర్మాణం, పునర్నిర్మాణం మరియు అభివృద్ధి చేపట్టారు. ప్రస్తుతం ఆలయాన్ని దేవాదాయ శాఖ నిర్వహిస్తోంది

అయినవిల్లి శ్రీ వినాయక దేవాలయంలో పాలాభిషేకం మరియు అన్నదాన రేట్లు తెలుసుకుందాం.

  • అయినవిల్లి  సిద్ధి వినాయక అభిషేకం ధరలు, 150/-
  • శ్రీ లక్ష్మీ గణపతి హోమం ధరలు 300/-
  • లక్ష్మీ దర్వార్చన పూజ మరియు లక్ష్మీ గరిక పూజ ధరలు, 25/-
  • వినాయక చవితి పండ్లు పాలు అభిషేకం ధరలు, 250/-
  • తద్య అన్నదానం మరియు నిత్యా అన్నదానం ధరలు, 300/-
  • పెళ్లెవరోజు అన్నదానం ధరలు, 300/-
  • విశిష్ట మహారాజు పుష్కరాలు ధరలు, 100,000/-
  • మహారాజు  పుష్కరాలు ధరలు, 50000/-
  • రాజు పురస్కారాలు ధరలు, 25000/-
  • పురస్కారాలు ధరలు,  10000/-
  • దాతలు సేవ ధరలు, 1116/- 

అయినవల్లి సిద్ధి వినాయక ఆలయ చరిత్ర,(History of Ainavilli Siddhivinayak Temple)

  అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక  స్వామి వారు ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉంది. 100 శతాబ్దాల కింద ఈ ఆలయం చిన్న గుడి లాగా ఉండేది. క్రిష్ పూర్వం 9వ శతాబ్దంలో నీ ఆలయం గుడి నిర్మాణం ఉందని చెప్పుకోవచ్చు. చోళుల పాలనలో అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయం కొలువ ఉందని చెప్పవచ్చు. 650  నుండి 890  చోళుల పరిపాలల్లో ఈ గుడి నిర్మాణం కలిగి ఉంది.

శ్రీకృష్ణదేవరాయ కాలంలో అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి రెండు పురాణ స్థలాలు ఉన్నాయి తెలుసుకుందాం. 

మొదటి కథ ప్రకారం:-  గోదావరి నది యొక్క పచ్చని పొలాల మధ్య కోనసీమ ప్రాంతం వాస్తు శాస్త్రంలో వివరించిన పవిత్రతను మరియు పవిత్ర అనుభూతిని గుర్తు చేస్తుంది. కోనసీమలోని ఈ ప్రాంతంలో అయినవిల్లిలో "సిద్ది వినాయక దేవాలయం" ఉంది. దక్ష యజ్ఞం నిర్వహించే ముందు దక్ష ప్రజాపతి విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ప్రదేశంలో వినాయకుని పూజ చేయాలని భావించారు. ఇది ఇక్కడి "క్షేత్ర పురాణం"లో వ్రాయబడింది.

రెండవ కథ ప్రకారం:- వ్యాస మహర్షి తన దక్షిణాది పర్యటన ప్రారంభంలో పార్వతీ పుత్రుడిని ఈ ప్రదేశంలో ప్రతిష్టించాడని మరియు ఈ యుగంలో - "సిద్ది వినాయకుడు" తన భక్తుల కోరికలను తీర్చగలడని మరొక కథనం.

 ఎత్తైన ప్రాంతం, ఈ వినాయక దేవాలయం దక్షిణాభిముఖంగా విగ్రహంతో ఉంటుంది. రెండు గోపురాలు మరియు ద్వారాలతో, దక్షిణం నుండి వినాయకుడిని మరియు తూర్పు నుండి శ్రీ విశ్వేశ్వర స్వామిని దర్శించవచ్చు. అదే కాంపౌండ్‌లో శ్రీ దేవి, భూదేవి శ్రీ కేశవ స్వామితో కొలువై ఉన్నారు. పక్కనే శ్రీ అన్నపూర్ణాదేవి కొలువై ఉంది. పక్కనే శ్రీ కాలభైరవ స్వామి మరియు క్షేత్రపాలకులు ఉన్నారు.ప్రతి నెలా చవితి, దశమి, ఏకాదశి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి నవరాత్రులు, కార్తీక మాసం, సంక్రాంతి నాడు ప్రభ పండుగ, శివరాత్రి ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)



 అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయం విశిష్టత గురించి మరియు నిర్మాణం గురించి ఈరోజు చెప్పడం అయితే జరిగింది. పురాణం కాలం నుండి ఈ దేవాలయం 100 సంవత్సరాల కిందట నాలుగు రాయలు కప్పుబడి ఉన్న దేవాలయం కు చెప్పుకోవచ్చు. చిన్న దేవాలయం కూడా
అంటారు. ఈ దేవాలయం అభివృద్ధి పొందుతూ వచ్చింది.

ఈ ఆలయంలో గోడలు చాలా ఎత్తైన గోడలను చెప్పుకోవచ్చు. రాయితో కట్టిన దేవాలయం చాలా బలంగా ఎత్తైన ఉంటుంది బెల్లం సున్నం ద్రవ్యాలతో కట్టిన కట్టుబడుతూ గట్టిగా ఉంటుంది గోడలు. చాళుక్య రాజ్యల పరిపాలనలో ఈ దేవాలయం ఉందని జరిగింది 14వ శతాబ్దంలో పూజలు చేస్తూ ఉండాలని చెప్పుకోవచ్చు. ఆలయంలో నాలుగు గోపురాలు ఉన్నాయి గోపురాలు చుట్టూ శిల్పాలతో అందంగా ఉన్నాయి అవి ఓల్డ్ కలర్ రంగులో ఒక భాగం తెల్ల కలర్ సొగ భాగం ఉంటుంది. గజ స్తంభాలు 35 దాకా ఉంటాయి.

 వాటిపై శిల్పాలు చాలా చక్కగా గీశారు. స్ట్రక్చర్ కూడా చాలా అందంగా లైట్లు మరియు వైరింగ్ సెట్టింగ్స్ కూడా చాలానే బాగా వేశారు. దేవాలయం ఏ కలర్ లో ఉంటుందంటే తెలుపు రంగు కలర్ మరియు బంగారు కలర్ లో ఉంటుంది. గుడు చుట్ట ప్రాంతంలో కొండ శ్రేణులు మరియు పెద్ద పెద్ద చెట్లు నదులు వంటి సౌకర్యాలతో కలుగును ఈ దేవాలయం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు,చల్లని వాతావరణం ప్రదేశంలో తేలుతూ ఉంటాము.

 అందుబాటులో వున్నా వసతి అతిధి గృహాలు 

అమలాపురంలోని కొత్త కాటన్ గెస్ట్ హౌస్, పంచాయత్ రాజ్ డిపార్ట్‌మెంట్, అమలాపురంచే నియంత్రించబడుతుంది. సంప్రదించండి: 08856-231909

అమలాపురంలోని పంచాయత్రాజ్ అతిథి గృహం పంచాయత్రాజ్ శాఖ నియంత్రణలో, అమలాపురం. సంప్రదించండి: 08856-231442

పంచాయత్రాజ్ శాఖ, అమలాపురం నియంత్రణలో కొత్తపేటలోని పంచాయతీరాజ్ అతిథి గృహం. సంప్రదించండి: 08856-231442


అయినవిల్లి సిద్ధి వినాయక చేరే మార్గాలు,( Ways to reach Ainavilli Siddhivinayak)

రోడ్డు  మార్గం ,  

అయినవల్లి శ్రీ సిద్ది వినాయక స్వామివారుకు దర్శించడానికి రెండు ప్రాంతాల నుండి రోడ్డు మార్గం రవాణా సౌకర్యం కలిగి ఉందని చెప్పుకోవచ్చు.  ఆర్టీసీ బస్సు ప్రైవేట్ వెహికల్స్ జీప్ వంటి సౌకర్యాలతో రోడ్డు ప్రయాణం సాగు పంపవచ్చు మరియు దివ్య చక్ర వాహనాలు కూడా రోడ్డు ప్రయాణానికి పోవడానికి సౌకర్యం కలిగి ఉంది.

  • హైదరాబాదు నుండి అయినవిల్లి 460 km
  • బెంగళూరు నుండి అయినవిల్లి 448 km  
  • మంత్రాలయం నుండి అయినవిల్లి 695 km
  • కేరళ నుండి అయినవిల్లి 1268 km

రోడ్డు ప్రయాణం చేసేవారు అయినవల్లి శ్రీ సిద్ధ వినాయకుడి దేవాలయానికి పోవడానికి భక్తాదులు సులభమైన రవాణా సౌకర్యం ఉందని చెప్పడం జరిగింది.

రైలు మార్గం,

దక్షిణ భారతదేశంలో శ్రీ సిద్ధి వినాయక దేవాలయానికి  రైలు మార్గాలు సౌలభ్యం కలదు. ప్రాచీన
యుగం నుండే రైల్వే మార్గాలు దేవాలయానికి ఉండడానికి ముఖ్యమైన గమనిక చెప్పవచ్చు. మన రెండు ప్రాంతాల నుండి రైల్వే మార్గానికి సిద్ధి వినాయక దేవాలయానికి ఉంది.

  • హైదరాబాదు (HYD,SEC)
  • మంత్రాలయం (MALM)
  • బెంగళూరు (SBC)
  • కేరళ (TCR)

అయినవిల్లి సిద్ధి వినాయక దేవాలయానికి విమాన మార్గం చాలా సులువైన మార్గంలో ఉంది.అందుబాటులో ఉన్న ఎయిర్పోర్ట్స్ వైజాగ్, రాజమహేంద్రవరం.



 అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక  మరియు విఘ్నేశ్వర స్వామి వారు  దయగల దేవుడు  సిరి సంపద తో  భక్తాదులకు తోడుగా ఉంటారు.  పిల్లలు లేనివారు  ఇక్కడ వచ్చి పూజలు చేస్తే  సంతాన సౌభాగ్యం  కలుగుతుందని భక్తాదులు నమ్ముతారు.  

19, డిసెంబర్ 2024, గురువారం

ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన 20 అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలు

 


ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన 20 అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలు
ఆంధ్రప్రదేశ్, సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి సౌందర్యం, మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం, పర్యాటకులకు విస్తృత స్థలాలను అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన 20 ప్రదేశాలు ఉన్నాయి:
1. తిరుపతి
ప్రత్యేకతలు:
• ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడే యాత్రాకేంద్రమైన తిరుమల వెంకటేశ్వర దేవాలయం ఇక్కడే ఉంది.
• ఇతర ఆకర్షణలు: కపిల తీర్థం, చంద్రగిరి కోట.
2. అరకు వ్యాలీ
ప్రత్యేకతలు:
• ఆకట్టుకునే పచ్చటి పర్వత ప్రాంతం, కాఫీ తోటలు, గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి.
• బొర్రా గుహలు, కటికీ జలపాతాలు, గిరిజన మ్యూజియం చూడదగినవి.
3. విశాఖపట్నం (విజాగ్)
ప్రత్యేకతలు:
• ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ వంటి బీచ్‌లతో ప్రసిద్ధమైన తీర నగరం.
• ఆకర్షణలు: కైలాసగిరి, INS కురుసురా సబ్‌మెరైన్ మ్యూజియం, సింహాచలం దేవాలయం.
4. విజయవాడ
ప్రత్యేకతలు:
• “విజయనగరం”గా పిలువబడే ఈ నగరంలో కనకదుర్గ దేవాలయం, ప్రకాశం బ్యారేజ్ ప్రసిద్ధి.
• భవానీ దీవి, కొండపల్లి కోట సందర్శించవచ్చు.
5. అమరావతి
ప్రత్యేకతలు:
• బౌద్ధ స్మారకమైన అమరావతి స్తూపం చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది.
• ఆధునిక రాజధాని ప్రాజెక్టులు, శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయం చూడవచ్చు.
6. లేపాక్షి
ప్రత్యేకతలు:
• పురాతన వీరభద్ర స్వామి దేవాలయం, తేలియాడే స్తంభంతో ప్రసిద్ధి.
• మహా నంది విగ్రహం, గంపలు నిక్షిప్త కవచాల కళాఖండాలు.
7. గండికోట
ప్రత్యేకతలు:
• కడప జిల్లాలో గల “భారత గ్రాండ్ కేనియన్” అందమైన నది గుండాలు.
• గండికోట కోట, పెన్నా నది దృశ్యాలు చూడవచ్చు.
8. శ్రీకాళహస్తి
ప్రత్యేకతలు:
• శ్రీకాళహస్తీశ్వర దేవాలయం, శివునికి అంకితమైనది.
• ఆధ్యాత్మిక, శిల్పకళా వైభవం ప్రసిద్ధం.
9. బెలుం గుహలు
ప్రత్యేకతలు:
• నంద్యాల జిల్లాలో ఉన్న భారతదేశంలో రెండవ అతిపెద్ద గుహల సముదాయం.
• అద్భుతమైన ప్రాకృతిక శిలాశిల్పాలు చూడవచ్చు.
10. కర్నూలు
ప్రత్యేకతలు:
• రాయలసీమకు గేట్వే. అహోబిలం ఆలయం, కొండా రెడ్డి కోట, ఒర్వకల్ రాక్ గార్డెన్ చూడవచ్చు.
11. రాజమండ్రి
ప్రత్యేకతలు:
• ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని, గోదావరి నదితో అనుసంధానం.
• గోదావరి బ్రిడ్జ్, డౌలేశ్వరం బ్యారేజ్, పాపి కొండలు సందర్శించవచ్చు.
12. కోనసీమ
ప్రత్యేకతలు:
• పచ్చని కొబ్బరి తోటలు, ప్రశాంతమైన బ్యాక్ వాటర్‌లతో ప్రకృతి అందాల సమాహారం.
• హౌస్ బోట్ అనుభవం ప్రత్యేకం.
13. అనంతపురం
ప్రత్యేకతలు:
• లేపాక్షి ఆలయం, పెనుకొండ కోట, మరియు ప్రపంచంలోనే పెద్ద బనియన్ చెట్టు తిమ్మమ్మ మర్రి మాను.
14. నాగార్జునకొండ
ప్రత్యేకతలు:
• కృష్ణా నది మధ్యనున్న ద్వీపం, బౌద్ధ ధాతువులు, పురావస్తు మ్యూజియంతో ప్రసిద్ధి.
15. హార్స్లీ హిల్స్
ప్రత్యేకతలు:
• హాయిగా వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు.
• ట్రెక్కింగ్, నేచర్ వాక్స్ కోసం ప్రసిద్ధి.
16. కడప
ప్రత్యేకతలు:
• గండికోట కోట, అమీన్ పీర్ దర్గా, పుష్పగిరి ఆలయాలు ప్రసిద్ధి.
17. మహానంది (నంద్యాల జిల్లా)
ప్రత్యేకతలు:
• ప్రాచీన మహానందీశ్వర స్వామి ఆలయం, పవిత్ర జలకుండాలు ప్రసిద్ధి.
18. మచిలీపట్నం
ప్రత్యేకతలు:
• బీచ్‌లు, చారిత్రక బందర కోట ప్రసిద్ధి.
• కలంకారి కళ, వస్రాలు ప్రత్యేకం.
19. పుట్టపర్తి
ప్రత్యేకతలు:
• శ్రీ సత్యసాయి బాబా జన్మస్థలం, ప్రసాంతి నిలయం ఆశ్రమం.
• ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రసిద్ధి.
20. నాగార్జున సాగర్
ప్రత్యేకతలు:
• భారతదేశంలోనే అతిపెద్ద డ్యామ్‌లలో ఒకటి.
• ఏతిపోతల జలపాతాలు, నాగార్జునకొండ ద్వీపం చూడవచ్చు.
ప్రయాణ సూచనలు:
• సందర్శనానికి ఉత్తమ సమయం: అక్టోబర్ నుండి మార్చి.
• సాంస్కృతిక కార్యక్రమాలు: సంక్రాంతి, ఉగాది, తిరుపతి బ్రహ్మోత్సవం కోల్పోవద్దు.
• స్థానిక వంటకాలు: ఆంధ్ర భోజనాలు, గోంగూర పచ్చడి, పెసరట్టు తప్పక రుచించండి.

18, డిసెంబర్ 2024, బుధవారం

పళని మురుగన్‌ మహత్యం

 

పళని మురుగన్‌ మహత్యం

అంతుబట్టని నవ పాషాణం!


అటు చరిత్రకీ ఇటు శాస్త్రీయతకీ అందని అసాధారణ నైపుణ్యానికీ విజ్ఞానానికీ చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు.


వాస్తునిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటివాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం.




సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నులపండువగా జరుగుతుంది. అందులో పాల్గొన్నవాళ్లకి సంతానప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.


నిరవధికంగా పదహారు గంటలపాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాశి, అగ్నినక్షత్రం... ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేర రాజు చేరమాన్‌ పెరుమాళ్‌ పునర్నిర్మించినట్లూ ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లూ తెలుస్తోంది.


నిజానికి విగ్రహం క్రీ.పూ. మూడువేల సంవత్సరాలనాటిదనీ చాలాకాలం నిర్లక్ష్యానికి గురైందనీ, చేరమాన్‌ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు.ఆదిత్యయోగీ.


మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండమీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతోపాటు రోప్‌ వే లాంటి సౌకర్యమూ ఉంది. గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తాడు. 


"అన్నీ వదిలేసి నన్ను చేరుకో" 

అన్నదే స్వామి అలా కనబడటంలోని అంతరార్థమట. ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని దండాయుధపాణి, బాల సుబ్రహ్మణ్యం, మురుగన్‌, శరవణన్‌... ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు.


"స్థలపురాణం"

ప్రమద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి, నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకుని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకూ అధిపతివి నీవే అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందించారట. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండమీదే కొలువుంటానని తల్లితండ్రులకు చెబుతాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి జ్ఞానం సిద్ధిస్తుందనీ శివుడు వరమిస్తాడట. తమిళంలో 'పళం' అంటే 'ఫలం', 'నీ' అంటే 'నీవు' అని అర్థం. అందుకే ఇది పళని అయ్యిందట.


కావడీ ఉత్సవం!

దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే, ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరినవాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి, కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడిలో భూమిమీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువవడంతో- కావడిని కిందపెట్టి సేదతీరతాడు ఇడుంబుడు. కావడిని మళ్లీ పైకెత్తబోతే అది లేవదు సరికదా, అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు- కొండమీదకి పరుగెడతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి, మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి, కావడీలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్ళకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. 'నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తార'నీ చెబుతాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పూలు... వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందనీ దాంపత్య దోషాలు తొలగిపోతాయనీ నమ్ముతారు.


ఏమిటీ నవ పాషాణం!

పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు. ఆలయంలోని మూలవిరాట్టుని దర్శించుకుని, తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులూ తొలగిపోతాయని నమ్మేవారు.


దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడి స్వామి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో "భోగర్‌" అనే సిద్ధుడు తయారుచేశాడట. అందుకే దీన్ని నవ పాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, తొమ్మిది అనీ; పాషాణ అంటే విషం, ఖనిజం అనీ అర్థాలు ఉన్నాయి. భోగర్‌ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటినుంచి తొమ్మిది విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారుచేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో తొమ్మిదింటిని సేకరించి ఈ నవపాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధగుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలూ పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరువు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్టురోగం నయమయ్యేదని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోతుండటంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేదం (చెమట) పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందనీ, గంధంతోపాటు కారే నీటిచుక్కలు ఆకుపచ్చరంగులో ఉంటాయనీ అంటారు. వీటిని ఒడిసిపట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీనతీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అయితే విగ్రహాన్ని లక్షలకొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారనీ, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడంవల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్లి వాటి సంఖ్య పెరగడంవల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన.ఆదిత్యయోగీm


"ఎవరీ సిద్ధ భోగర్‌?"

క్రీ.పూ. 550-300 కాలానికి చెందిన భోగర్‌ పళని కొండల సమీపంలోని వైగావూర్‌లో జన్మించాడు. ఈయన తన తల్లి, తాతల దగ్గర విద్యను అభ్యసించి, కాలంగి నాథర్‌ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడనీ ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కారణమేంటనేది తెలిసేది కాదు. దాంతో భోగర్‌ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్‌ విగ్రహాన్ని రూపొందించి, పూజించాడట. కన్నివాడిలోని మైకంద సిద్ధర్‌ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్‌ దీన్ని తయారుచేసి, పళని కొండమీద ప్రతిష్ఠించాడనీ, ఆపై విగ్రహాన్ని పాలూ పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడనీ చెబుతారు. విగ్రహం ఉన్న కొండ కింద గుహలోనే భోగర్‌ జీవసమాధిలోకి వెళ్లినట్లు చెబుతారు.


తమిళనాట పేరొందిన పద్ధెనిమిది మంది సిద్ధుల్లో కాలంగి నాథర్‌ ఒకరు. గురువైన కాలంగి నాథర్‌ చివరి కోరిక మేరకు భోగర్‌ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్లినట్లూ; శ్రీలంక మీదగా తామ్రపర్ణియన్‌ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లూ సప్తకందలో రాసుకున్నాడు. పులిప్పాని వంశీకులు పదహారో శతాబ్దం వరకూ ఈ ప్రాంతంలో ఉండేవారనడానికి ఆధారాలున్నాయి. పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు. కానీ ఏమిటనేది తెలియలేదు. అయితే "గట్టి లింగం, గుర్రంపన్ను, నల్ల పాషాణం, రస సింధూరం, తెల్ల పాషాణం, రక్త పాషాణం, కంబి నవరసం, కౌరి పాషాణం, సీలై పాషాణం" ఇలా తొమ్మిది రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహాన్ని తయారుచేశారని కొందరంటారు. ఆ మూలికలకోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారనీ అంటారు. 


అందుకే... పళని మురుగన్‌ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం..!


పంచామృతం!

లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తుకొచ్చినట్లే, పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తుకొచ్చేది పళని సుబ్రహ్మణ్యస్వామే. మహత్తరమైన రుచీ ఔషధ, పోషక గుణాలున్న ప్రసాదం. ఇది కొన్ని నెలలు నిల్వ ఉంటుందట. ఎంత పాతబడితే అంత రుచి అనీ అంటారు. అందుకే స్వామివారి దర్శనానంతరం ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండల్లోని విరుప్పాచ్చి అనే ఊళ్లో మాత్రమే పండే వేలెడంత సైజు తియ్యని అరటిపండ్లను చిదిమి దానికి కంజీయం ప్రాంతంలో పండించే చెరకుతో చేసిన ముడి పంచదార చేర్చి, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, యాలకులు, నెయ్యి సరైన పాళ్లలో కలిపి తయారుచేస్తారు....*






శ్రీ పాతాల సెంబు మురుగన్ ఆలయం

 "పాతాళ సెంబు మురుగన్ దేవాలయంలోని స్వామిని దర్శించిన పిమ్మట, అక్కడ 41 రోజులపాటు స్వామి మీద వేసి ఉంచి, అభిషేకించిన కరుంగళి మాలలకే శక్తి వస్తుంది. వాటిని ధరించిన వారికే ఫలితం ఉంటుందని సిద్దార్ భోగర్ వరమిచ్చాడు" అనేది ఆలయ ప్రాశస్త్యం.






అసలు కథలోకి వెళ్తే...


రామలింగంపట్టి శ్రీ పాతాల సెంబు మురుగన్ ఆలయం తమిళనాడులోని దిండిగల్‌లోని రామలింగపట్టిలోని భోగర్ నగర్‌లో ఉంది. ఇక్కడి ప్రధాన దైవం మురుగన్. ఇక్కడ పాతాల సెంబు మురుగన్ అని పిలుస్తారు. పళని మురుగన్ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని పశ్చిమ కనుమల పర్వతాలు మరియు దేవర్మలై చుట్టుముట్టాయి. ఈ ఆలయం యొక్క గర్భగుడి భూమి లోపలికి 16 అడుగుల గుహలో ఉంది అందుకే పాతాళ (భూగర్భ) సెంబు (రాగి) మురుగన్ అనే పేరు వచ్చింది అంటారు. భూగర్భ గర్భాలయానికి చేరుకోవడానికి భక్తులు 18 మెట్లు దిగాలి. ఈ "పాతాళ సెంబు" అనే పదానికి "బంగారు మురుగన్" అని మరొక అర్ధం కూడా ఉందని అంటారు. ఈ రూపాన్ని శ్రేయస్సు మరియు రక్షణ కోసం పూజిస్తారు. భూగర్భ గుహలో నిలుచుని స్థితిలో ఉన్న మురుగన్ కుడిచేతి అభయ ముద్రను ప్రదర్శిస్తుంది మరియు ఎడమ చేతిలో వేల్ (ఈటె) ఉంటుంది.


పురాణాల ప్రకారం, సిద్ధ సాధువు, బోగర్, భక్తులకు మంచి ఆరోగ్యం కోసం నవపాషణం ఉపయోగించి పళనిలో మురుగన్ విగ్రహాన్ని సృష్టించాడు. భోగరుడు సప్తఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి శిష్యుడు. పూర్వానికి తిరుకోవిలూర్ సిద్ధర్ అనే శిష్యుడు ఉండేవాడు, ఇతను భోగరుడి అవతారంగా భావించబడతాడు. తిరుకోవిలూర్ సిద్ధార్ ఈ క్షేత్రంలో మురుగ విగ్రహాన్ని ప్రతిష్టించి, ఇక్కడ ఆయనకు పూజలు చేశారు.


1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంది. ఈ దేవాలయం సుప్రసిద్ధ పరిహార స్థలం. ఎంతోమంది భక్తులు తమ జాతకాలలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి నివారణల కోసం ఇక్కడకు వస్తారు. ఇక్కడి మురుగన్ దేవతా ప్రతిమ నవపాషణంతో తయారు చేయబడింది. ఇది 5 లోహాలను కలిగి ఉంటుంది - బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు సీసం. భూగర్భ గుహలో ఉన్న విగ్రహానికి ప్రతిరోజూ అభిషేకం చేస్తారు. రామనాథపురం సంస్థానానికి చెందిన రాజు భాస్కర సేతుపతి వంశస్థుడైన గంధమారన్ విగ్రహం యొక్క వైభవాన్ని తెలుసుకుని ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించాడు 


పవిత్రమైన విభూతి ఆలయంలో ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఈ సువాసనగల విభూతి 18 రకాల మూలికలతో తయారు చేయబడిందని, వివిధ రకాల వ్యాధులను నయం చేయగలదని భక్తుల విశ్వాసం. ఇందులో దైవీ గుణాలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు.


ఇక్కడి ప్రత్యేకత ఏమంటే భూగృహలో ఉన్న మురుగన్ ప్రతిమ మీద మరియు పాదాల వద్ద ఉంచి అభిషేకించిన కరుంగళి మాలలను భక్తులు అత్యంత విశ్వాసంతో, భక్తి శ్రద్దలతో ధరిస్తారు. ఈ కరుంగళి మాల ధరించడం వల్ల ఆ వ్యక్తి యొక్క నెగటివ్ పవర్ తొలగిపోతుందని విశ్వాసం. ప్రతికూల ప్రభావాలను పరిష్కరించగలవని, మంచి ఆరోగ్యం మరియు సంపదను తీసుకురాగలవని మరియు ప్రతికూల శక్తులను తిప్పికొట్టగలవని, వివాహంలో జాప్యం, సంతానలేమి, శత్రువులపై విజయం, వృత్తిలో రాణించడం, రాహు, కేతు మరియు కుజ దోషాల నుండి ఉపశమనం, భూమి మరియు ఆస్తి తగాదాల పరిష్కారం, విద్య, జ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.


#అరుణాచలశివ 🙏

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...